యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఒక వారం ముందుగా.. డిసెంబర్ 12న ముగియనున్న జాతీయ పురుషుల హాకీ క్యాంప్
Posted On:
25 NOV 2020 7:08PM by PIB Hyderabad
భారత క్రీడా ప్రాధికారిక సంస్థ (శాయి) బెంగళూరు క్యాంపస్లో జరుగుతున్న జాతీయ పురుషుల హాకీ శిబిరం ఒక వారం ముందుగా డిసెంబర్ నెల 12వ తేదీనే ముగియనుంది. వాస్తవంగా ఈ శిబిరం డిసెంబరు 18న ముగియాల్సి ఉంది. పురుషుల సీనియర్ హాకీ జట్టు చీఫ్ కోచ్ సిఫారసు మేరకు ఈ శిబిరాన్ని
ఒక వారం ముందుగానే ముగించనున్నారు. నాలుగు నెలల నిరంతర శిక్షణ తరువాత ఈ శిబిరాన్ని డిసెంబరు 12వ తేదీన ముగించి.. జనవరి 5వ తేదీ వరకు అంటే మూడు వారాలు అథ్లెట్లకు దీర్ఘ విరామం ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ మూడు వారాల విరామంలో అథ్లెట్లకు చీఫ్ కోచ్ మరియు పురుషుల సీనియర్ టీం యొక్క సైంటిఫిక్ అడ్వైజర్ పూర్తి చేయడానికి గాను సమగ్ర బలం మరియు కండిషనింగ్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన తరువాత భారత పురుషుల హాకీ జట్టు ఈ ఏడాది ఆగస్టు నుండి శాయి బెంగళూరు కేంద్రంలో శిక్షణను పొందుతోంది.
వచ్చే ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్కు జట్టు ఇప్పటికే అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
*******
(Release ID: 1675875)