సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కొత్తగా సీఐసీగా నియమితులైన శ్రీ వై.కె.సిన్హా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో భేటీ

ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం రేటును క్రమంగా మెరుగుపరచడం గురించి సిఐసి మంత్రికి వివరించారు

Posted On: 15 NOV 2020 6:05PM by PIB Hyderabad

కొత్తగా నియమితులైన కేంద్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీ యశ్వర్ధన్ కుమార్ సిన్హా ఈ రోజు ఈశాన్య ప్రాంత అభివృద్ధి (స్వతంత్ర ఛార్జ్) (డోనెర్), మోస్ పిఎంఓ, సిబ్బంది, ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలిశారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమితులు కావడానికి ముందు బ్రిటన్ ‌కు భారత హైకమిషనర్‌గా పదవీ విరమణ చేసిన 62 ఏళ్ల శ్రీ సిన్హా, ప్రస్తుత కేంద్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవికి ఆయన స్థాయిని పెంచారు. అయన దివంగత లెఫ్టినెంట్ జనరల్ ఎస్కె సిన్హా  కుమారుడు. ఎస్కె సిన్హా జమ్మూ & కాశ్మీర్, అస్సాం మాజీ గవర్నర్ గాను, ఆర్మీ వైస్ చీఫ్ గా కూడా పనిచేశారు. 

 

 

కేంద్ర మంత్రితో అర్ధ గంట సమావేశంలో, కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్టీఐ దరఖాస్తుల క్రమంగా మెరుగుపరిచే రేటు గురించి క్లుప్తంగా వివరించారు. జూన్ నెలలో, కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, ఆర్టీఐ దరఖాస్తుల నెలవారీ పరిష్కరించే రేటు గత ఏడాది జూన్ నెలలో అంటే 2019 కంటే ఎక్కువగా ఉంది. ఆన్‌లైన్, వర్చువల్, వీడియో కాన్ఫరెన్స్‌ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా కోవిడ్ కాలంలో కూడా కేంద్ర సమాచార కమిషన్ తన పనిని నిరంతరాయంగా కొనసాగించినందున ఇది సాధ్యమయిందని ఆయన అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర పాలిత ప్రాంతాన్ని కేంద్ర సమాచార కమిషన్ పరిధిలోకి తీసుకువచ్చినప్పటి నుండి జమ్మూ కాశ్మీర్  లో ఆర్టీఐ దరఖాస్తులను పరిష్కరించే  స్థితి గురించి శ్రీ సిన్హా డాక్టర్ జితేంద్ర సింగ్‌కు వివరించారు. ప్రభుత్వం నుండి నిరంతరం మద్దతు ఇవ్వడం, సిబ్బంది మరియు శిక్షణ శాఖ (డిఓపిటి) సమన్వయం చేసినందుకు ఆయన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర సమాచార కమిషన్ పనితీరును మెరుగుపరచడానికి, ఆర్టీఐ విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తీసుకున్న అనేక కొత్త కార్యక్రమాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. జమ్మూ, కశ్మీర్ విషయానికొస్తే, ఇప్పుడు ఉన్న తేడా ఏమిటంటే, జమ్మూ & కాశ్మీర్ యొక్క నాన్-డొమిసిల్ లేదా నాన్-స్టేట్ సబ్జెక్టులు కూడా యుటి సమస్యలు లేదా ఏజెన్సీలకు సంబంధించిన ఆర్టిఐలను దాఖలు చేయడానికి అర్హులు అని వివరించారు. 

ఆర్టీఐ దరఖాస్తులను ఏ సమయంలోనైనా మరియు దేశంలోని ఏ ప్రాంతం నుండి లేదా విదేశాల నుండి అయినా ఇ-ఫైలింగ్ కోసం 24 గంటల పోర్టల్ సేవను మోడీ ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి గుర్తించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవీకాలంలోనే, కేంద్ర సమాచార కమిషనర్ కార్యాలయాన్ని దాని సొంత ప్రత్యేక కార్యాలయ సముదాయానికి మార్చారని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి మోడీ దృష్టికోణం పారదర్శకత మరియు పౌరుడు - ప్రభుత్వ పనితీరులో పాల్గొనడం అందుకు అనుగుణంగా పనిచేయడంలో కేంద్ర సమాచార కమిషన్ పాత్ర ముఖ్యమని డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు.

 

<><><><><>



(Release ID: 1673089) Visitor Counter : 178