ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కేశూభాయ్‌ ప‌టేల్ మరణం ప‌ట్ల ఉపరాష్ట్రపతి సంతాపం

Posted On: 29 OCT 2020 4:27PM by PIB Hyderabad

గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేశూభాయ్‌ పటేల్‌ మరణం పట్ల ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి సందేశం:

    "కేశూభాయ్‌ పటేల్‌ మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ప్రజాదరణ గల నాయకుడు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కేశూభాయ్‌, రైతుల విషయంలో ఎప్పుడూ విజేతగానే నిలిచారు. వారి సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పాటుబడ్డారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెచ్చారు. కేశూభాయ్‌ హృదయంలో రైతులు, వ్యవసాయ భారతానిది ప్రత్యేక స్థానం.

    "వినమ్ర నేపథ్యం నుంచి ఎదిగిన శ్రీ కేశూభాయ్‌ పటేల్‌; కష్టించేతత్వం, నిరాడంబరత, ఆదర్శప్రాయ నాయకత్వంతో గుజరాత్‌ ముఖ్యమంత్రి స్థానాన్ని చేరుకున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నా, అందరికీ చేరువగా, వినయపూర్వకంగా నడుచుకున్నారు".

    "భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. కేశూభాయ్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా సంతాపం. ఓం శాంతి."

***



(Release ID: 1668692) Visitor Counter : 111