వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్ర‌స్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కార్య‌క‌లాపాలు

- స‌జావుగా ముందుకు సాగుతున్న వ‌రి సేక‌ర‌ణ కార్య‌క‌లాపాలు

- ఈ నెల 18వ తేదీ నాటికి 7.82 లక్షల మంది రైతుల‌ నుండి 90.03 ఎల్‌ఎమ్‌టీల వరి కొనుగోలు

- ఆదివారం నాటికి రూ.46697.86 లక్షల విలువైన 1,65,369 ప‌త్తి బేళ్ల సేకర‌ణ గత ఏడాది ఇదే కాలంలో ప‌త్తి సేక‌ర‌ణ‌ 1245 బేళ్లు మాత్ర‌మే

Posted On: 19 OCT 2020 5:47PM by PIB Hyderabad

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2020-21 ప్రారంభంతో కేంద్ర ప్రభుత్వం గ‌త‌ సీజన్లలో మాదిరిగానే.. ప్రస్తుతం ఉన్న‌ క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్‌పీ) పథకాల ప్రకారంగా రైతుల నుండి సీజ‌న్ పంటలను ఎంఎస్‌పీ వద్ద కొనుగోలు చేస్తోంది. కేఎంఎస్ 2020-21కు సంబంధించి పంజాబ్, హర్యాణా, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఛండీగ‌ఢ్‌, జ‌మ్ము కాశ్మీర్‌, కేరళ త‌దిత‌ర రాష్ట్రాలు కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో వ‌రి పంటల‌ సేక‌ర‌ణ స‌జావుగా సాగుతోంది.


ఆదివారం నాటికి (18వ తేదీ నాటికి) దాదాపు 7.82 లక్షల మంది అన్న‌దాత‌ల నుండి 90.03 ఎల్‌ఎమ్‌టీల వరిని కొనుగోలు చేయడం జ‌రిగింది. దీనికి తోడుగా 18.10.2020 నాటికి ప్రభుత్వం తమ‌ నోడల్ ఏజెన్సీల ద్వారా రూ.5.48 మేర ఎంఎస్‌పీ విలువ గ‌ల‌ 761.55 మెట్రిక్ టన్నుల పెస‌ర్లు మరియు మినుముల‌ను

 


కొనుగోలు చేశారు. దీంతో తమిళనాడు మహారాష్ట్ర, హర్యాణా రాష్ట్రాల‌లోని 735 మంది రైతులకు లబ్ధి చేకూరింది. అదే విధంగా రూ.52.40 కోట్ల ఎంఎస్‌పీ విలువ క‌లిగిన 5089 మెట్రిక్ టన్నుల కొబ్బ‌రిని (శాశ్వత పంట) సేక‌రించారు. దీంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో దాదాపు 3961 మంది రైతులకు లబ్ధి చేకూరింది. కొబ్బ‌రి, మినుముల‌ను ప్రధానంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో రేట్లు ఎంఎస్‌పీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఖరీఫ్‌లో పప్పు ధాన్యాలు, నూనె గింజలు
విక్ర‌యానికి వ‌చ్చే స‌మయానికి కొనుగోళ్లు జ‌రిపేందుకు అనువుగా ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సేకరణ ప్రారంభించడానికి వీలుగా రాష్ట్రాలు, యూటీ ప్రభుత్వాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. 2020 ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్      కు సంబంధించి రాష్ట్రాల నుంచి అందిన ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు ధర మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద 42.46 ఎల్ఎంటీల ప‌ప్పు ధాన్యాలు, నూనె గింజ‌ల కొను‌గోళ్ల‌కు అనుమ‌తి ల‌భించింది. కొనుగోళ్ల‌కు అనుమ‌తి ల‌భించిన రాష్ట్రాల‌లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్ర‌దేశ్ ఉన్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్‌ఎమ్‌టీల కొబ్బ‌రి ( శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది. పీఎస్ఎస్ విధానం కింద పప్పు ధాన్యాలు, నూనెగింజలు, కొబ్బ‌రి సేకరణకు త‌గిన‌ ప్రతిపాదనలు వచ్చిన తరువాత ఇతర రాష్ట్రాలు/ ‌యూటీల‌కు అనుమతి ఇవ్వబడుతుంది. దీంతో 2020-21 సంవత్సరానికి గాను ఈ పంటల యొక్క ఎఫ్ఏక్యూ గ్రేడ్ సేకరణను నోటిఫైడ్ ఎంఎస్‌పీ రిజిస్టర్డ్ రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసే వీల‌వుతుంది. నోటిఫైడ్ హార్వెస్టింగ్ వ్యవధిలో మార్కెట్ రేటు ఎంఎస్‌పీ కంటే తక్కువగా ఉంటే ఆయా రాష్ట్రాలు/ యూటీలలో రాష్ట్రంలో నామినేట్ చేసిన ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సెంట్రల్ నోడల్ ఏజెన్సీల ద్వారా రైతుల నుంచి పంట‌ల కొనుగోలు చేయ‌డం జ‌రుగుతోంది. ఎంఎస్‌పీ విధానం కింద‌ పత్తి సేకరణ కార్యకలాపాలు పంజాబ్‌, రాజ‌స్థాన్ త‌దిత‌ర ఉత్తర భార‌త రాష్ట్రాల్లో చాలా సజావుగా సాగుతోంది. ఈ సీజ‌న్‌లో ఆదివారం (18వ తేదీ) నాటికి రూ.46697.86 లక్షల విలువైన 165369 ప‌త్తి బేళ్లు సేక‌రించారు. గత ఏడాది ఇదే కాలంలో సేకరించిన మొత్తం ప‌త్తి బేళ్లు 1245 మాత్రంగానే నిలిచాయి.

                               

*****


(Release ID: 1665947) Visitor Counter : 133