ప్రధాన మంత్రి కార్యాలయం

ఎన్ఎస్‌జి సిబ్బందికి వారి స్థాప‌క దినం నాడు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 16 OCT 2020 10:19AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎన్ఎస్‌జి స్థాప‌క దినం సంద‌ర్భం లో ఎన్ఎస్‌జి బ్లాక్ క్యాట్స్ సిబ్బందికి, వారి కుటుంబాలకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘ఎన్ఎస్‌జి బ్లాక్ క్యాట్స్‌ సిబ్బందికి వారి కుటుంబాల‌కు ఎన్ఎస్‌జి స్థాప‌క దినం సంద‌ర్భంగా ఇవే శుభాకాంక్ష‌లు.  భార‌త‌దేశ భ‌ద్ర‌త యంత్రాంగంలో ఒక కీల‌క పాత్ర‌ను ఎన్ఎస్‌జి పోషిస్తోంది.  అత్యంత ధైర్య సాహసాలతోను, అమిత వృత్తినిపుణత తోను ఎన్ఎస్‌జి పేరు ముడిపడి ఉంది.  భార‌త‌దేశాన్నిసుర‌క్షితంగా, భ‌ద్రంగా ఉంచ‌డంలో ఎన్ఎస్‌జి కృషిని చూసుకొని భార‌త‌దేశం గ‌ర్వపడుతోంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
 

***
 



(Release ID: 1665105) Visitor Counter : 128