పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ మార్కెట్ నుండి ముడి చమురు కొనుగోలు
प्रविष्टि तिथि:
21 SEP 2020 1:37PM by PIB Hyderabad
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకొంటూ. భారతదేశం ఈ ఏడాది ఏప్రిల్- మే మాసాలలో 16.71 మిలియన్ పీపాల (ఎంబీబీఎల్) ముడి చమురును కొనుగోలు చేసింది. విశాఖపట్నం, మంగుళూరు మరియు పాడూర్ వద్ద సృష్టించిన మూడు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ ప్రాంతాలలో ఈ ముడి చమురు నిల్వలను నింపింది. ఈ ముడి చమురు సేకరణ సగటు వ్యయం బీబీఎల్కు 19 డాలర్లుగా సమీకరించడం జరిగింది. జనవరి 2020లో ఈ ధర బీబీఎల్కు 60 డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తాజా కొనుగోళ్ల ద్వారా 685.11 మిలియన్ డాలర్ల మేర సొమ్ము సర్కారుకు ఆదా అయింది. అంటే డాలరుకు రూ.74 లెక్కన రూ.5069 కోట్ల మేర సొమ్ము ఆదా అయింది. మార్కెట్ ధరల మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా 26.06.2010 మరియు 19.10.2014 నుంచి నిర్ణయిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) అంతర్జాతీయ ఉత్పత్తి ధరలు మరియు ఇతర మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టుగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై తగిన నిర్ణయం తీసుకుంటున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ ఉత్పత్తి ధరలు, మార్పిడి రేటు, పన్ను నిర్మాణం, లోతట్టు సరుకు మరియు ఇతర వ్యయ అంశాలతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత రిటైల్ అమ్మకపు ధరపై నిర్ణయం తీసుకుంటాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మార్కెట్ ధరల మేరకు నిర్ణయించబడతాయి. మార్కెట్ పోకడల ప్రకారం పెరుగుతాయి లేదా తగ్గుతాయి. టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) లో పెట్రోల్ మరియు డీజిల్ యొక్క బరువు వరుసగా 1.60% మరియు 3.10%. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.
(रिलीज़ आईडी: 1657445)
आगंतुक पटल : 267