రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఉత్తర సిక్కింలో చైనా పౌరులను రక్షించిన భారత సైనికులు

Posted On: 05 SEP 2020 2:00PM by PIB Hyderabad

ఉత్తర సిక్కింలో, 17,500 అడుగుల ఎత్తులో దారి తప్పిపోయిన ముగ్గురు చైనా పౌరులను భారత సైనికులు రక్షించారు. ఈనెల 3వ తేదీన ఈ సంఘటన జరిగింది.

    దారి తప్పిపోయిన ముగ్గురిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో వారి ప్రాణాలకు ప్రమాదాన్ని గుర్తించిన భారత సైనికులు తక్షణం వారికి వైద్య సాయం, ఆహారం, వెచ్చటి దుస్తులు అందించారు.

    వారు కోలుకున్న తర్వాత, గమ్యస్థానం చేరడానికి సరైన మార్గం చెప్పి సురక్షితంగా పంపించారు. తమకు తక్షణ సాయం అందించినందుకు భారతదేశానికి, భారత సైనికులకు చైనా పౌరులు కృతజ్ఞతలు తెలిపారు.

 

***



(Release ID: 1651554) Visitor Counter : 126