రాష్ట్రప‌తి స‌చివాల‌యం

దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

Posted On: 21 AUG 2020 5:09PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం ఇచ్చారు:

    "వినాయక చవితి శుభ సందర్భంగా, దేశ ప్రజలతోపాటు, విదేశాల్లో ఉన్న భారతీయులకు నా శుభాకాంక్షలు".

    "లంబోదరుడి పుట్టినరోజుగా ఈ పండుగను జరుపుకుంటాం. సమాజంలోని అన్ని వర్గాలు కలిసి ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకునే వేడుక ఇది".

    "కరోనా సవాళ్లను ఎదుర్కొంటున్న సమయమిది. ఈ సవాళ్లను సాధ్యమైనంత త్వరగా అధిగమించి, అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా పార్వతీ తనయుడు ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నా".

    "భారతీయులందరి మధ్య సామరస్యం, సోదరభావం, ఐక్యతను బలోపేతం చేద్దామని ఈ పండుగ సందర్భంగా అంతా ప్రతిజ్ఞ చేద్దాం".
 

రాష్ట్రపతి సందేశాన్ని హిందీలో చూడటానికి ఇక్కడ క్లిక్‌ చేయండి. 

***
 



(Release ID: 1647740) Visitor Counter : 162