రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత తీర రక్షణ దళం ఆఫ్ షోర్ గస్తీ నౌక ‘సార్థక్’ ప్రారంభించబడింది

Posted On: 13 AUG 2020 6:48PM by PIB Hyderabad

భారత తీర రక్షణ దళం ఆఫ్ షోర్ గస్తీ నౌక (ఓ.పి.వి) ను రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ గారి భార్య శ్రీమతి వీణా అజయ్ కుమార్ ఈ రోజు ప్రారంభించారు.  ఈ నౌకకు భారతీయ రక్షణ దళం నౌక "సార్థక్" గా పేరు పెట్టారు.   గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, జి.ఎస్.ఎల్, యార్డ్-1236 వద్ద జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని, అంతర్జాతీయ మహమ్మారి కోవిడ్-19 పై భారత ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి, న్యూఢిల్లీ లోని తీర రక్షణ దళం ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించారు.   ఈ కార్యక్రమంలో,  రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్;  భారతీయ తీర గస్తీ దళం డైరెక్టర్ జనరల్ శ్రీ కె.నటరాజన్; జి.ఎస్.ఎల్. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తో పాటు,  రక్షణ మంత్రిత్వ శాఖ కు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

ఐదు ఓ.పి.వి. ల  శ్రేణిలో ఓ.పి.వి. - సార్థక్ 4వ నౌక. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనకు అనుగుణంగా దీనిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ (జి.ఎస్.ఎల్) దేశీయంగా రూపొందించి, నిర్మించింది.  ఈ నౌకలో అత్యాధునిక నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, యంత్రాలు అమర్చబడి ఉంటాయి.  105 మీటర్ల పొడవైన ఈ ఓడ సుమారు సుమారు 2,350 టన్నుల బరువును రవాణా చేస్తుంది. 9,100 కిలోవాట్ల రెండు డీజిల్ ఇంజన్ల ద్వారా గరిష్టంగా 26 నాట్ల వేగంతో 6,000 నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణించే సామర్ధ్యం ఉంది.   అధునాతన పరికరాలు, వ్యవస్థతో కలిసి సంరక్షణ, చేరుకోవడంతో పాటు, కమాండ్ ప్లాట్‌ఫాం పాత్రను పోషించే సామర్థ్యంతో, కోస్ట్ గార్డ్ చార్టర్‌ను నెరవేర్చడానికి అవసరమైన సేవలను ఈ నౌక అందిస్తుంది.  ఈ నౌకలో రెండు ఇంజన్లు కలిగిన హెలికాప్టర్ ను నిలుపు చేయడానికీ, బయలుదేరడానికి వీలుగా సౌకర్యం ఉంటుంది.  ఈ నౌకలో వేగంగా ప్రయాణించే నాలుగు బోట్లు, వేగంగా శోధించి, సహాయ కార్యక్రమాలు నిర్వహించే గాలితో నింపిన ఒక పడవ కూడా ఉంటాయి.  సముద్రంలో చమురు చిందటం వంటి, కాలుష్య ప్రతిస్పందనను చేపట్టడానికి పరిమిత కాలుష్య ప్రతిస్పందన పరికరాలు కూడా ఈ ఓడలో ఉంటాయి. 

ఆన్ లైన్ ద్వారా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్నిఏర్పాటుచేసిన భారత తీర రక్షణ దళం మరియు జి.ఎస్.ఎల్. సంస్థలను డాక్టర్ అజయ్ కుమార్ అభినందించారు.  భారత తీర రక్షణ దళం యొక్క పెరుగుతున్న బలానికి మరియు  భారతీయ నౌకా నిర్మాణ సామర్ధ్యానికీ ఇది సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. భారతీయ సముద్ర దళాల యొక్క నౌకల ఉత్పత్తి మరియు నిర్వహణకు ఇది ఒక  బలమైన సహాయక స్తంభంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు.   కోవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ, ఒప్పందం ప్రకారం, సకాలంలో నౌక నిర్మాణాన్ని పూర్తిచేసిన గోవా షిప్ యార్డ్ యొక్క వృత్తి నైపుణ్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఐ.సి.జి. డైరెక్టర్ జనరల్ శ్రీ కె. నటరాజన్ మాట్లాడుతూ,  నౌక ప్రారంభోత్సవం అనేది ఏ నౌక కైనా చాలా ముఖ్యమైన రోజు అనీ, ఎందుకంటే, తన జీవితాంతం వరకు నీటిలోనే ఉండే ఆ నౌక మొదటిసారి జల ప్రవేశం చేసే రోజు కాబట్టి అని వ్యాఖ్యానించారు.   సముద్రంలో భారతీయ తీర రక్షణ దళం యూనిట్ ఒకటి సముద్రంలో కేవలం ఉంటే చాలు, "నియంత్రణ" మరియు "భరోసా" యొక్క ద్వంద్వ లక్ష్యాలను నెరవేరుస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.  ఇది చెడు ఉద్దేశ్యంతో వచ్చే ప్రజలను నిర్బంధిస్తుంది.  అదే సమయంలో భారత తీర రక్షణ దళాన్ని  "సముద్రంలో రక్షకులు" గా చూసే సముద్ర సమాజానికి భరోసా ఇస్తుంది, ఎందుకంటే, సముద్రంలో ఏదైనా అత్యవసర లేదా ప్రాణాంతక పరిస్థితి సంభవిస్తే భారత తీర రక్షణ దళం వేగంగా స్పందిస్తుందని సముద్ర సమాజానికి తెలుసు తెలుసు.  జి.ఎస్.ఎల్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు గోవా కోస్ట్ గార్డ్ రీఫిట్ అండ్ ప్రొడక్షన్ సూపరింటెండెంట్ తో పాటు, అంకితభావంతో కృషి చేసిన వారి బృందాలను కూడా ఆయన ప్రశంసించారు.  

భారత తీర రక్షణ దళం స్వదేశీ ఆస్తులను ప్రవేశపెట్టడంలో ముందుంది, ఇది ఏడాది పొడవునా కార్యాచరణలో ఉండటానికి వీలు కల్పించింది.  ఈ రోజు ప్రారంభించిన నౌక లో సుమారు 70 శాతం దేశీయ సామగ్రి వినియోగించడం జరిగింది. తద్వారా భారతీయ నౌకా నిర్మాణ పరిశ్రమకు అవసరమైన సామగ్రి దేశీయంగా సమకూర్చడంతో పాటు ‘ఆత్మ నిర్బర్ భారత్’ సాధించే దిశగా ఇది ఒక భారీ ముందడుగు. 

దేశం యొక్క సముద్ర ప్రయోజనాలను కాపాడడం కోసం నిర్ణీత తీర రక్షణ విధుల జాబితాలో పొందుపరిచిన ఈ.ఈ.జెడ్. నిఘా, తీర భద్రతతో పాటు ఇతర విధుల కోసం ఈ నౌకను విస్తృతంగా మోహరిస్తారు.  05 ఓ.పి.వి. ప్రాజెక్టుతో పాటు, వివిధ భారతీయ నౌకా నిర్మాణ కేంద్రాలలో 52 నౌకలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.  16 అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్లు, బెంగళూరు లోని హెచ్.ఏ.ఎల్. వద్ద ఉత్పత్తిలో ఉన్నాయి.   సముద్ర సవాళ్లను ఎదుర్కోడానికి భారత తీర రక్షణ దళం యొక్క నిఘా సామర్థ్యాలకు ఇది అదనపు బలాన్ని అందిస్తుంది.

"మేము రక్షిస్తాం" అనే అర్ధంతో "వయం రక్షమా" అనే నినాదానికి అనుగుణంగా,  సముద్రంలో 9,730 మంది ప్రాణాలను, పౌర అధికారులకు అందించిన సహాయంలో భాగంగా 12,500 మంది ప్రాణాలను రక్షించిన ఘనత, వైద్య సహాయం కోసం 400 మందిని తరలించిన ఘనత, భారత తీర రక్షణ దళానికి దక్కింది. భారత తీర రక్షణ దళం ప్రతి రెండవ రోజున సముద్రంలో ఒక ప్రాణాన్ని కాపాడుతుంది.  భారత తీర రక్షణ దళం చేపట్టే నిరోధక చర్యలు కేవలం భారత జలాలకు మాత్రమే పరిమితం కాదు,  ద్వైపాక్షిక సహకార ఒప్పందాల నిబంధనల ప్రకారం స్నేహపూర్వక సముద్ర తీర రాష్ట్రాలతో సహకరించడం వల్ల హిందూ మహాసముద్రం ప్రాంతం (ఐ.ఓ.ఆర్) లో విజయవంతంగా నిర్బంధించడం మరియు ఔషధాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. ఐ.సి.జి. మరియు ఇతర అంతర్జాతీయ ఏజెన్సీల మధ్య వాస్తవ సమాచార భాగస్వామ్యం, సన్నిహిత సమన్వయం, అవగాహన వంటి కార్యకలాపాల కారణంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయి. 

భారత ప్రత్యేక ఆర్ధిక మండలి (ఈ.ఈ.జెడ్) నిషిద్దమైన 6,800 కోట్ల రూపాయలను నిర్భందించటం ఖాయం.  భారత ఉపఖండం చుట్టూ ‘సురక్షితమైన, భద్రమైన, శుభ్రమైన సముద్రాలు’ ఉండేలా భారత తీర రక్షణ దళం కట్టుబడి ఉంది.

*****



(Release ID: 1645689) Visitor Counter : 194