ఆయుష్
ఏఐఐఏ లోని కోవిడ్ సెంటర్లో ఏర్పాట్లను సమీక్షించిన ఆయుష్ మంత్రి
Posted On:
28 JUL 2020 6:43PM by PIB Hyderabad
న్యూఢిల్లీ సరితా విహార్లోని 'ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద' (ఏఐఐఏ) లోని కోవిడ్-19 హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) ను ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్ సందర్శించారు. కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం కేంద్రంలో ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. అక్కడి వైద్య బృందంతో కూడా సంభాషించి కేంద్రంలోని రోగుల శ్రేయస్సు గురించి ఆయన ఆరా తీశారు. కోవిడ్-19 ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఆయుర్వేదపు ఔ షధాల చికిత్స ఫలితాల గురించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో ఏఐఐఏ అందించే సేవలపై మంత్రి తన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయుర్వేద సూత్రాల ఆధారంగా కోవిడ్ పాజిటివ్ రోగుల ఆరోగ్య సంరక్షణకు గాను ఏఐఐఏ మొత్తం బృందపు ఉత్సాహం, చూపుతున్న తెగువ మరియు ప్రయత్నాలు ప్రశంసనీయమని ఆయన అన్నారు. భారతదేశం అంతటా కోవిడ్ -19 రోగులకు వ్యక్తిగతీకరించిన ఆయుర్వేద ఔషధం, ఆహారం, యోగా మరియు పలు విశ్రాంతి పద్ధతుల ద్వారా సంపూర్ణ సంరక్షణ అందించడంలో ఏఐఐఏ ఆదర్శవంతమైన పాత్ర పోషిస్తోందని వివరించారు. ఇన్స్టిట్యూట్లో కోవిడ్-19 రోగుల సానుకూల స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉందని మంత్రి అన్నారు. సీహెచ్సీలోని రోగులందరూ జీవితం పట్ల సానుకూల విధానాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా వారిలో పరివర్తనతో చాలా సంతృప్తి చెందారన్నారు. ఆయుష్ విధానం కోవిడ్ వ్యాధిని అధిగమించడంలో మాత్రమే కాకుండా వారి జీవితంలోని ఇతర దశలలో కూడా వారికి సహాయపడుతుంది. సంపూర్ణ ఆయుర్వేద సంరక్షణ ద్వారా కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి వారు చేసిన ప్రయత్నాలలో ఆదర్శవంతమైన పాత్ర పోషించినందుకు ఏఐఐఏ యొక్క మొత్తం బృందాన్ని ఆయన అభినందించారు. భారతదేశ సాంప్రదాయ వ్యవస్థ - ఆయుర్వేదం ఈ మహమ్మారి నివారణ మరియు నివారణ ఆరోగ్య సంరక్షణలో భారీ సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. సీహెచ్సీలో చేరిన రోగులలో ఎక్కువ మందికి ఆహారం మరియు యోగాతో సహా స్వతంత్ర ఆయుర్వేదపు చికిత్స ప్రోటోకాల్ను అందించారు. తొంభై శాతం కంటే ఎక్కువ ఎస్పీఓ2 తో చికిత్స కాలంలో సమస్యలు లేకుండా వంద శాతం రికవరీలను చూపించి మంచి ఆరోగ్యంతో రోగులు డిశ్చార్జ్ అయ్యారు. లక్షణాల తీవ్రత గమనించబడలేదు. ప్రవేశించిన రోగులలో ఇప్పటివరకు సున్నా శాతం మరణాలు ఉన్నట్లు కూడా గమనించవచ్చని ఆయన అన్నారు. డిశ్చార్జ్ ముందు అందిరిలోనూ నెగటీవ్ వచ్చింది. దీంతో ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆయుర్వేదాన్ని ఫ్రంట్లైన్ హెల్త్ కేర్ సిస్టమ్గా బృందం యొక్క జ్ఞానం మరియు అనుభవం తప్పనిసరిగా ముందు ఉంచబడుతుంది. ఏఐఐఏ లోని ఉచిత కోవిడ్-19 పరీక్షా కేంద్రాన్ని కూడా మంత్రి సందర్శించారు. ఏఐఐఏ లోని కోవిడ్ -19 పరీక్షా కేంద్రంను (ఆర్టీ-పీసీఆర్ మరియు రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్) ఢిల్లీ ప్రభుత్వం నియమించింది.
***
(Release ID: 1641891)