శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

జోర్హాట్‌లోని సి.ఎస్.ఐ.ఆర్-ఎన్.ఈ.ఐ.ఎస్.టి. ‌లో కోవిడ్-19 పరీక్షా ప్రయోగశాల ప్రారంభించబడింది

Posted On: 02 JUN 2020 10:51AM by PIB Hyderabad

జోర్హాట్ లోని ఈశాన్య ప్రాంత శాస్త్ర సాంకేతిక సంస్థ (ఎన్.ఈ.ఐ.ఎస్.టి)  ప్రాంగణంలో కోవిడ్-19 పరీక్షా ప్రయోగశాలను ఏర్పాటు చేశారు.   అస్సాం రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆర్థిక, విద్య (ఉన్నత, ద్వితీయ మరియు ప్రాథమిక), పరివర్తన మరియు అభివృద్ధి, పి.డబ్ల్యు.డి., శాఖల మంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ, ఈ ప్రయోగశాలను ప్రారంభించారు.  సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.ఈ.ఐ.ఎస్.టి. డైరెక్టర్, డాక్టర్ జి. నరహరి శాస్త్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సంఘటన సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.ఈ.ఐ.ఎస్.టి. చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మిగిలిపోతుందని అభివర్ణించారు.

పరీక్షా సదుపాయాన్ని తెరిచిన అస్సాంలో ప్రప్రథమ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఎన్.ఈ.ఐ.ఎస్.టి. అని, డాక్టర్ హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు.  ఇందుకు సహకరించిన శాస్త్రవేత్తలు మరియు సంస్థ సిబ్బందిని ఆయన అభినందించారు.

ఈ సంస్థకు చెందిన 10 మంది శాస్త్రవేత్తల బృందం వైరస్ నుండి ఆర్.‌ఎన్.‌ఎ. ను వేరుచేయడంలో చురుకుగా పాల్గొనగా, మరో 40 మంది సిబ్బంది సహాయక వ్యవస్థగా పనిచేస్తున్నారని డాక్టర్ శాస్త్రి పేర్కొన్నారు.  ఆర్.టి.-పి.సి.ఆర్.-ఆధారిత కోవిడ్-19 పరీక్షలను నిర్వహించడంలో ఈ సంస్థకు చెందిన జీవ సాంకేతిక విజ్ఞాన విభాగం కీలక పాత్ర పోషిస్తోంది.  వీరికి తోడు, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, జోర్హాట్ జిల్లా పరిపాలనా యంత్రాంగం కూడా సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు చురుకుగా సహకరిస్తున్నాయి.  

సంస్థ డైరెక్టర్ డాక్టర్ జి. నరహరి శాస్త్రి సమక్షంలో సి.ఎస్.ఐ.ఆర్- ఎన్.ఈ.ఐ.ఎస్.టి వద్ద కోవిడ్ -19 పరీక్షా ప్రయోగశాలను డాక్టర్ హిమంత బిస్వా శర్మ ప్రారంభించారు.

ఈ సంస్థకు చెందిన కోవిడ్-19 పరీక్షా ప్రయోగశాల లో నిర్వహించిన పరీక్షలను ధృవీకరించడానికి, అస్సాం రాష్ట్ర  ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఒక మైక్రోబయాలజిస్ట్ ను నియమించారు.   పరీక్ష కోసం నమూనాలను రాష్ట్ర ప్రభుత్వం మరియు జోర్హాట్ జిల్లా పరిపాలన సమన్వయంతో పొందాలని భావిస్తున్నారు.  పరీక్షల నిర్వహణ కోసం ఒక  ప్రాజెక్ట్ శాస్త్రవేత్తను, ఒక పరిశోధనా స్కాలర్ ను సంస్థ నియమించింది. 

సంస్థ శాస్త్రీయ కార్యక్రమాలు, పరిశోధన, సాంకేతికతలు మరియు ఉత్పత్తుల బాధ్యతలను డాక్టర్ శర్మ స్వీకరించారు.   ఎన్.ఈ.ఐ.ఎస్.టి చేత పేటెంట్ పొందిన మరియు వాణిజ్యీకరించబడిన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.  ఈ సంస్థ వాణిజ్యపరంగా రూపొందించిన కొన్ని ముఖ్యమైన విజయాలలో ఆర్థరైటిస్ వ్యతిరేక మూలికా లేపనం, యాంటీ ఫంగల్ లేపనం, కొత్త రకాల సుగంధ మొక్కలు ఉన్నాయి.

"ప్రస్తుత పరిస్థితుల్లో,  కోవిడ్-19 పరీక్షా ప్రయోగశాల ఏర్పాటు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇది కమ్యూనిటీ ప్రసార స్థాయికి ముందే వైరస్ ను పరీక్షించడం, కనిపెట్టడం, వేరుచేయడం అత్యంత ప్రభావవంతమైన మరియు ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన విధానం.  అస్సాం 3 వ దశను దాటే స్థాయి వద్ద ఉంది, ఇది సమాజ స్థాయి ప్రసార దశ ”అని డాక్టర్ శాస్త్రి అన్నారు.

పరిస్థితిని తగ్గించడానికి మరియు కలిగి ఉండటానికి ఏకైక మార్గం విస్తృతమైన పరీక్షలతో ముందుకు సాగడం, మరియు మహమ్మారిపై పోరాడటానికి లక్షలాది మంది ప్రజల సంకల్పానికి ఇదే  ఒక బలమైన ఆశా కిరణం అని ఆయన అన్నారు.  అదే సమయంలో, సవాలు ఏమిటంటే అలా చేయగల సామర్థ్యం కొద్ది మంది చేతుల్లోనే ఉంటుంది.  అందువల్ల, వైరస్ పై దృష్టి ఉంచడానికి, ఖచ్చితంగా నివారణ కోసం సమర్థవంతమైన మందులు మరియు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి సాధ్యమైనంత ఎక్కువ పరీక్షలను నిర్వహించడమే,  ఇప్పుడు శాస్త్రీయ సమాజం యొక్క ముఖ్యమైన పని.

****



(Release ID: 1628599) Visitor Counter : 300