వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

అత్యవసర మందులు, చికిత్సలు, వాక్సిన్లు అందుబాటు ధరల్లో ఉండేలా చూడాలని జి-20 దేశాలకు పిలుపునిచ్చిన భారత్

వసుధైవ కుటుంబకం అనే సంప్రదాయానికి నిజాయితీగా కట్టుబడి ఉన్న భారత్, వ్యాధిపై పోరాడడానికి 120 దేశాలకు బేషరతుగా మందులను అందజేసిందని జి-20 వాణిజ్య మంత్రుల సమావేశంలో చెప్పిన శ్రీ పియూష్ గోయల్

ప్రధాన మంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసిన తర్వాత భారత్ పటిష్టమైన దేశంగా అవతరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి

ప్రజాస్వామ్య విలువలను పంచుకునేలా, నిబంధనలే ఆధారంగా, పారదర్శక వ్యాపార నమూనా, మానవాళి పట్ల కరుణ అనే ఒక పరిపూర్ణ ఆలోచనతో భావ సారూప్యం గల దేశాలు భాగస్వామ్యం అయ్యేలా ప్రపంచం ముందుకు రావాలి

Posted On: 14 MAY 2020 8:23PM by PIB Hyderabad

అత్యవసర మందులు, చికిత్సలు, వాక్సిన్లు అందుబాటు ధరల్లో ఉండేలా చూడాలని జి-20 దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన రెండవ జి-20 దేశాల వాణిజ్య, పెట్టుబడుల శాఖల మంత్రుల వర్చ్యువల్ సదస్సు లో  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ తన అభిప్రాయాలను వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా ప్రజలు ఎదురుకొంటున్న దురవస్థలను తగ్గించడానికి జి-20 సభ్య దేశాలు తక్షణమే గట్టి చర్యలు చేపట్టేలా దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. విలువైన ప్రాణాలు కాపాడాలని అన్నారు. అవసరమైన మందులు, చికిత్సలు మరియు వ్యాక్సిన్లను సరసమైన ధరలకు పొందటానికి టిఆర్ఐపిల వశ్యత, సారాళ్యాన్ని ఉపయోగించుకునేలా ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు. రోగనిర్ధారణ, రక్షణ పరికరాలు, మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులను దేశాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడానికి అంగీకారానికి రావాలని  ఆయన జి -20 దేశాలకు పిలుపునిచ్చారు.

 ఎగుమతి పరిమితుల విధానపర ఆంక్షలు తొలగించడం అనేది వైద్య ఉత్పత్తులు, అందరికీ ఆహారాన్ని పొందటానికి సంజీవని కాదని శ్రీ గోయల్ అన్నారు. వాస్తవానికి, అటువంటి దశ ఈ క్లిష్టమైన ఉత్పత్తులను అత్యధిక బిడ్డర్‌కు లభ్యమై తద్వారా ఆ చర్య పేదలకు అందుబాటులో ఉండదు. వ్యవసాయానికి సంబంధించిన ఒప్పందంలోని చారిత్రాత్మక అసమానతలను తొలగించడానికి అంగీకరించడం ద్వారానూ, శాశ్వత, తగినంత, ప్రాప్యత గల విభాగాలను స్థాపించడానికీ మంత్రిత్వ శాఖ దీర్ఘకాలిక ఆదేశాలను ఇవ్వడం , అత్యంత దుర్బలమైన వారి ఆహార భద్రతను నిర్ధారించడానికి మరింత ప్రభావవంతమైన, శాశ్వత మార్గం అని ఆయన అన్నారు. 

 

“గత కొన్ని నెలలుగా మా దేశం పరిణామం చెందేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రతిష్టాత్మక సంస్కరణ ఎజెండాను ప్రారంభించాము. మా భవిష్యత్తు ఐదు పునాదులపై రూపొందించబడుతుంది - బలమైన, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ, భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిరమైన, ఊహించదగిన నియంత్రణ పద్ధతులతో ఆధునిక వ్యవస్థలను నిర్మించడం, మా జిడిపిలో సుమారు 10% ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ గురించి ప్రధాని మోదీ ప్రకటించిన తరువాత మేము మరింత బలంగా బయటపడతామని మాకు నమ్మకం ఉంది. ” అని శ్రీ పియూష్ గోయల్ అన్నారు. భారతదేశానికి ఉండే శక్తి సామర్త్యాలు, నిబద్ధత గురించి చెబుతూ, మహమ్మారి విరుచుకుపడిన  ప్రారంభ రోజుల్లో తాము కొన్ని వేలల్లో కూడా పీపీఈ లను ఉత్పత్తి చేసే పరిస్థితిలో లేమని ఎందుకంటే అంత అవసరం గతంలో రాలేదని మంత్రి చెప్పారు. అయితే వివిధ దేశాలు అవసరం మేరకు పీపీఈ వంటి వస్తువులను సరఫరా చేసే పరిస్థితి లేదని గ్రహించి, తమ దేశ ఉత్పత్తి దారులు రంగంలోకి దిగారని,  రోజుకు 3 లక్షల పీపీఈ లను తయారు చేసే స్థాయికి వెళ్ళమని  శ్రీ పియూష్ గోయల్ తెలిపారు. 

ఔషధ రంగంలో కూడా భారతదేశం ముందుందని చెబుతూ, ప్రపంచమంతా ఒక పెద్ద కుటుంబమని భావించే సాంప్రదాయ పరంపర తమదని కేంద్ర మంత్రి అన్నారు. కొవిడ్ ని అంతమొందించడానికి చేస్తున్న యుద్ధంలో భాగంగా  తమ వైద్య సరఫరాలను 120 దేశాలకు పంపామని, వాటిలో 43 దేశాలు గ్రాంట్ గా స్వీకరించాయని చెప్పారు. విస్తృతమైన డిజిటల్ అంతరం కానీ, విభజన కానీ లేకుండా అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలకు చేదోడు వాదోడు గా ఉండాలని శ్రీ పియూష్ గోయల్ స్పష్టం చేసారు. 

***



(Release ID: 1623974) Visitor Counter : 241