శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

స్థిరవిద్యుత్ ఉపయోగించి రోగక్రిములను నిర్మూలించే టెక్నాలజీ వాణిజ్య సరళిలో వినియోగానికి బదిలీ

Posted On: 29 APR 2020 12:44PM by PIB Hyderabad

విశ్వ మహమ్మారి కరోనాపై పోరాటానికి సమర్ధవంతంగా రోగక్రిములను నాశనం చేసి శానిటైజ్ చేయడానికి  సి ఎస్ ఐ ఆర్ -  కేంద్ర శాస్త్రీయ పరికరాల సంస్థ (సి ఎస్ ఐ ఆర్ - సి ఎస్ ఐ ఓ), చండీగఢ్  సంస్థ ఒక వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేసింది.     సి ఎస్ ఐ ఆర్ - సి ఎస్ ఐ ఓ  సంస్థ ఈ టెక్నాలజీని వాణిజ్య సరళిలో భారీ ఎత్తున ఉత్పత్తి  చేయడానికి నాగపూర్ కు చెందిన రైట్ వాటర్ సొల్యుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు బదిలీ చేసింది.  ఈ టెక్నాలజీ కరోనా వైరస్ మరియు రోగాణువుల వ్యాప్తిని అరికట్టడంలో సమర్ధవంతంగా పనిచేసిందని సి ఎస్ ఐ ఆర్ - సి ఎస్ ఐ ఓ సంస్థకు చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు.  

 


 

స్థిరవిద్యుత్  సూత్రం ఆధారంగా స్థిరవిద్యుత్ తో  రోగక్రిములను నాశనం చేసే యంత్రాన్ని అభివృద్ధి చేశారు.   ఈ యంత్రం సహాయంతో అతి సూక్ష్మబిందువుల రూపంలో ఉండే రోగక్రిమి నాశకాలను ఉత్పత్తిచేసి వెదజల్లుతారు.  10-20 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉండే ఈ బిందువులు సూక్ష్మ జీవులను, వైరస్ లపై దాడి చేసి చంపేస్తాయి.     "ఈ బిందువులు ఉపరితలంపై పది వ్యాప్తి చెంది హానికారక సూక్ష్మ జీవులపై  మరియు కరోనా వైరస్ పై దాడి చేస్తాయి.  సంప్రదాయ పద్దతులతో పోలిస్తే  ఈ యంత్రం అతి తక్కువ పరిమాణంలో రోగక్రిమినాశక పదార్ధాలను ఉపయోగిస్తుంది.  దానివల్ల పర్యావరణంలో రసాయన వ్యర్ధాలు కొద్దీ పరిమాణంలో పెరిగినప్పటికినీ మొత్తం మీద ప్రకృతి  వనరులను ఆదా చేయడంలో సహాయకారిగా ఉంటుంది.   యంత్రం నుంచి వెలువడిన రోగక్రిమినాశక సూక్ష్మ బిందువులు ఎక్కువ విస్తీర్ణం వ్యాపించి సమర్ధవంతంగా పనిచేసి సాధ్యమైనంత ఎక్కువ వైరస్ ను నాశనం చేస్తుంది.   తద్వారా అవి  రోగాణువుల వృద్ధిని అరికడతాయి."  అని   ఈ టెక్నాలజీని ఆవిష్కరించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మనోజ్ కె. పటేల్ తెలిపారు.  
టెక్నాలజీ మార్పిడి ఒప్పందంపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంతకాలు చేశారు.  ఒప్పందంపై   రైట్ వాటర్ సొల్యుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ అభిజిత్ గాన్,   సి ఎస్ ఐ ఆర్ - సి ఎస్ ఐ ఓ,  చండీగఢ్  సంస్థలో వ్యాపార వ్యవహారాలు మరియు  ప్రాజెక్టు ప్లానింగ్ విభాగం అధిపతి  డాక్టర్ సురేంద్ర సింగ్ సైనీ  సంతకాలు చేశారు.    సి ఎస్ ఐ ఆర్ - సి ఎస్ ఐ ఓ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ మరియు ఇతర శాఖాధిపతులు కూడా పాల్గొన్నారు.    
స్థిరవిద్యుత్  యంత్రంతో రోగక్రిమినాశకాలను బహిరంగ ప్రదేశాలలో ముఖ్యంగా ఆసుపత్రులు, కోళ్ల ఫారాలు,  రైళ్లు మరియు బస్సులు,
 విమానాశ్రయాలు ,  విమానాలు , కార్యాలయాలు,  తరగతి గదులు మరియు హోటళ్లలో  వెదజల్లడం వల్ల ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని,  తద్వారా  జనబాహుళ్యం ఆరోగ్య సంరక్షణకు తోడ్పడుతుందని డాక్టర్ సంజయ్ కుమార్  అన్నారు.  
స్థిరవిద్యుత్ ద్వారా స్ప్రే చేసే వివిధ టెక్నాలజీలను ఇదివరకే పారిశ్రామిక సంస్థలకు బదిలీ చేయడం జరిగిందని డాక్టర్ సురేందర్ సింగ్ సైనీ తెలిపారు.     (ఇండియా సైన్స్ వైర్)    

(మరిన్ని వివరాల కోసం దయచేసి డాక్టర్ సురేందర్ సింగ్ సైనీని సంప్రదించండి.  ఈ మెయిల్:  sssaini@csio.res.in



(Release ID: 1619363) Visitor Counter : 235