మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రపంచ పుస్తక మరియు కాపీ రైట్ దినోత్సవం సందర్భంగా నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఫిక్కీ నిర్వహించిన పోస్ట్ – కోవిడ్ పబ్లిషింగ్ సినారియో వెబ్ నార్ లో పాల్గొన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
సనాతన జ్ఞాన సంపద మరియు పుస్తకాల నిధితో, భారతదేశం గతానికి, భవిష్యత్తుకు మధ్య వారధిగా నిలుస్తోంది – శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’
Posted On:
23 APR 2020 7:34PM by PIB Hyderabad
ప్రపంచ పుస్తక మరియు కాపీ రైట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ ‘నిశాంక్’ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, మరియు ఫిక్కీ న్యూఢిల్లీలో నిర్వహించిన పోస్ట్ – కోవిడ్ పబ్లిషింగ్ సినారియో పై ఏర్పాటు చేసిన వెబ్ నార్ పాల్గొన్నారు. ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, భారతదేశం విజ్ఞాన శక్తి అని తెలిపారు. పురాతన విశ్వవిద్యాలయాలు, సనాతన జ్ఞానం మరియు పుస్తకాల నిధితో భారతదేశం గతానికి మరియు భవిష్యత్తుకు మధ్య ఒక వారధిగా మరియు తరాలు, సంస్కృతుల మధ్య వారధిగా నిలుస్తోందని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే గర్వించదగిన జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రచురణకర్తలకు, రచయితలకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ నిశాంక్ అన్నారు. దేశంలో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆయన, పుస్తకాలు తమకు మంచి మిత్రులు అని నమ్మే దిశగా పిల్లలను ప్రోత్సహించాలని తెలిపారు.
కొన్ని పాశ్చాత్య దేశాల జనాభా మొత్తంతో పోలిస్తే భారతదేశ యువతే అధికంగా ఉందని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, రచయితలు, ప్రచురణకర్తలు మరియు విద్యావేత్తలు సరైన విజ్ఞానం వ్యాప్తి చెందేలా చూసుకోవలసిన అవసరం ఉందని, విజ్ఞానవంతమైన నవీన భారతదేశాన్ని నిర్మించాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ఉపన్యాసం చేసిన ఎన్.బి.టి. ఛైర్మన్, ప్రొఫెసర్ గోవింద్ ప్రసాద్ శర్మ, మౌఖిక సంప్రదాయం నుంచి మారుతున్న కాలాల గురించి, రాతపూర్వక ఫార్మెట్లను ముద్రణకు అందజేయడం గురించి మాట్లాడారు. సమాజం ఈ-లెర్నింగ్ ను జ్ఞాన వ్యాప్తికి ఒక పద్ధతిగా అంగీకరించే సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి మనందరినీ దెబ్బ తీయడంతో పాటు అందరూ పని చేసే విధానాన్ని మార్చేసిందని, ప్రస్తుతం విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు బోధించబడుతున్నాయని తెలిపారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కోసం ఈ – కంటెంట్ ద్వారా ప్రత్యక్ష సంబంధం లేకుండా విజ్ఞానాన్ని అందిస్తున్నామని, అదే సమయంలో ప్రచురణ పరిశ్రమకు మద్ధతు అందిస్తున్నామని, పోస్ట్ కోవిడ్ సమయంలో ప్రచురణ కర్తలు ఒకరికొకరు సహకారం అందిచుకోవాలని సూచించారు.
ఎన్.బి.టి. సంచాలకులు శ్రీ యువరాజ్ మాలిక్ ప్రసంగిస్తూ, మార్పు మాత్రమే జీవితంలో స్థిరంగా ఉంటుందని తెలిపారు. ఈ రోజుల్లో ప్రపంచం పెద్దగా మారిందని, ప్రచురణ పరిశ్రమ ఎదుర్కొంటున్న క్లిష్ట సవాళ్ళను ప్రస్తావించిన ఆయన, ఈ సమస్యలు తీరడానికి చాలా సమయం పట్టవచ్చని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తప్పకుండా అంగీకరిస్తూనే, ప్రచురణకర్తలుగా తమ కర్తవ్యమైన సమాజానికి సమాచారం మరియు జ్ఞానాన్ని వ్యాప్తి చేసే ప్రక్రియ కొనసాగించాలని తెలిపారు. డిజిటల్ మరియు ఈ – పబ్లిషింగ్ మాధ్యమాల ద్వారా కూడా దీన్ని తెలపవచ్చని, ఈ రోజు మనం సృష్టించినవి, రేపటి ముఖ్యమైన చారిత్రక పత్రాలుగా మారతాయని తెలిపారు.
నేషనల్ బుక్ ట్రస్ట్ కార్యక్రమాల గురించి మాట్లాడిన శ్రీ మాలిక్, రాబోయే కాలంలో మానవ సమాజానికి కరోనా మహమ్మారి ద్వారా ఎదురు కానున్న అసాధారణ మానసిక, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను గురించి తెలిపారు. ఎన్.బి.టి. కరోనా అనే ప్రచురణల సిరీస్ ను ప్రారంభించడానికి ప్రణాళిక తయారు చేసుకుందని, కరోనా అనంతరం పాఠకుల అవసరాలకు తగిన విధంగా అన్ని వయసుల వారికి సంబంధించిన పఠన సామగ్రిని డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి అందించేందుకు అనుభవజ్ఞులైన మనస్తత్వ వేత్తలు / సలహాదారులతో కూడిన స్టడీ గ్రూప్ స్టడీ సిరీస్ ను సిద్ధం చేస్తోందని తెలిపారు. తొలి ఉప సిరీస్ ను ఈ – ఎడిషన్ గా కరోనా మహమ్మారి యొక్క మానసిక, సామాజిక ప్రభావం మరియు ఎదుర్కోవలసిన మార్గాలు అనే అంశం మీద రూపొందించామని, అదనంగా ఎన్.బి.టి. కరోనా మీద అవగాహన కల్పించేందుకు కరోనా వారియర్స్ పై పిల్లల పుస్తకాలను మరియు వివిధ అంశాలకు సంబంధించిన ఇతర కథ మరియు చిత్ర పుస్తకాలను సిద్ధం చేస్తోంది.
అలాగే కళ, సాహిత్యం, జానపద కథలు, ఆర్థిక మరియు సామాజిక అంశాలు, కరోనా మహమ్మారి నుంచి సిద్ధం చేయగల శాస్త్రీయ/ ఆరోగ్య అవగాహన మరియు లాక్ డౌన్ వంటి పుస్తకాలు కూడా సిద్ధం కానున్నాయి.
అంతకు ముందు ఫిక్కీ పబ్లిషింగ్ కమిటీ ఛైర్ మరియు బర్లింగ్టన్ గ్రూప్ (ఇండియా మరియు సౌత్ ఈస్ట్ ఆసియా) సి.ఈ.ఓ,. శ్రీ రత్నేష్ ఝా స్వాగత ప్రసంగం చేశారు. ఫిక్కీ పబ్లిషింగ్ కమిటీ కో-ఛైర్, ఎం.బి.డి. గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీమతి మోనికా మల్హోత్రా కంధారి, ఫిక్కీ సెక్టరరీ జనరల్, దిలీప్ చినాయ్, ఫిక్కీ పబ్లిషింగ్ కమిటీ కో-ఛైర్ మరియు స్కాలస్టిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ నీరజ్ జైన్ పోస్ట్ కోవిడ్ లిమిటెడ్ పబ్లిషింగ్ ఇండస్ట్రీ, పోస్ట్ కరోనా పఠన అవసరాలు, డిజిటల్ పబ్లిషింగ్ / ఇ లెర్నింగ్ మరియు డిజిటల్ పబ్లిషింగ్ / ఇ-లెర్నింగ్ కోసం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల గురించి చర్చించారు.
ఈ వెబ్ నార్ లో చేరడానికి దేశవ్యాప్తంగా 180 మందికి పైగా లాగిన్ అయ్యారు. ఇందులో ప్రచురణకర్తలు, రచయితలు, సంపాదకులు, ఉపాధ్యాయులు, పుస్తక విక్రేతలు, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు మరియు వివిధ ప్రాంతాల నుంచి ప్రచురణ నిపుణులు పాల్గొన్నారు.
ప్రచురణ, బోధన, అభ్యాస పద్ధతుల్లో సంభావ్య మార్పు, పెరుగుతున్న ఈ లెర్నింగ్ పద్ధతుల్లో విద్యను తిరిగి పరిశీలించే మార్గాలను అర్థం చేసుకోవడంతో పాటు ఈ వెబ్ నార్ ప్రచురణ పరిశ్రమ కోసం పోస్ట్ – కోవిడ్ దృష్టాంతం అంతర్దృష్టిని అందించింది.
--
(Release ID: 1617672)
Visitor Counter : 211