ప్రధాన మంత్రి కార్యాలయం

భూటాన్ ప్రధానమంత్రికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు

Posted On: 20 MAR 2020 11:45PM by PIB Hyderabad


కోవిడ్ -19 అత్యవసరనిధికి సహాయం అందిస్తామని ప్రకటించిన భూటాన్ ప్రధానమంత్రి డాక్టర్ లోటై షేరింగ్ కు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.  
“భూటాన్ ప్రభుత్వం తరపున కోవిడ్ -19 అత్యవసర నిధికి లక్ష అమెరికా డాలర్ల విరాళం అందిస్తామని ప్రకటించినందుకు భూటాన్ ప్రధానమంత్రి డాక్టర్ లోటై షేరింగ్ కు కృతజ్ఞతలు.  కరోనావైరస్ పై సమష్టి పోరాటానికి సార్క్ దేశాల నాయకులు చొరవ చూపడం ద్వారా  పోరాటానికి మరింత శక్తిని చేకూర్చడం అద్భుతమైన విషయం” అని ప్రధానమంత్రి అన్నారు. 
 



(Release ID: 1607602) Visitor Counter : 87