మంత్రిమండలి

ఉగ్ర‌వాద నిరోధం అంశం పై ఒక సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు భార‌త‌దేశాని కి మ‌రియు మొరాకో కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 13 FEB 2019 9:30PM by PIB Hyderabad

ఉగ్ర‌వాద నిరోధానికై ఒక సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందాన్ని (జెడబ్ల్యు జి ని) ఏర్పాటు చేయ‌డం కోసం భార‌త‌దేశాని కి మ‌రియు మొరాకో కు మ‌ధ్య ఒక‌ అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద ప్ర‌తాని కి (ఎంఒయు కు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది. 

భార‌త‌దేశం, మొరాకో లు ఉగ్ర‌వాద నిరోధానికిగాను జెడ‌బ్ల్యుజి ని ఏర్పాటు చేయ‌డం ఉగ్ర‌వాద దాడుల‌ కు సంబంధించిన కేసుల‌ లో స‌హాయ‌కారి కాగ‌ల‌దు.  ఈ రకం గా ఈ ఎంఒయు ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల స‌మాచారాన్ని పరస్పరం పొందేందుకు/ఆ స‌మాచారాన్ని ఒక ప‌క్షాని కి మ‌రొక ప‌క్షం అందించేందుకు ఒక ప్రాతిప‌దిక గా ఉండబోతోంది.


**



(Release ID: 1564550) Visitor Counter : 113