ప్రధాన మంత్రి కార్యాలయం

కేదార్‌నాథ్ ఆల‌యం లో ప్రార్థ‌న‌లు చేసిన ప్ర‌ధాన మంత్రి; పున‌ర్ నిర్మాణ ప‌థ‌కాల పురోగ‌తి పై ప‌రిశీల‌న‌

Posted On: 07 NOV 2018 12:02PM by PIB Hyderabad

నేడు దీపావ‌ళి పండుగ‌ ను పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేదార్‌నాథ్ ను సంద‌ర్శించారు.  చారిత్ర‌క కేదార్‌నాథ్ ఆల‌యం లో ప్రార్థ‌నల‌ లో ఆయ‌న పాలుపంచుకొన్నారు.  పున‌ర్ నిర్మాణ ప‌నులు పెద్ద ఎత్తున సాగుతున్న‌ ఆల‌య ఆవ‌ర‌ణ అంత‌టా ఆయ‌న క‌లియ‌తిరుగుతూ సదరు పనులను ప‌రిశీలించారు.  ప‌నుల‌లో చోటు చేసుకొన్న పురోగ‌తి ని సీనియ‌ర్ అధికారులు ఆయ‌న కు వివరించారు.  ఆల‌య ప్రాంగ‌ణం లో  ప్ర‌జానీకం తో ఆయ‌న కొద్ది సేపు ముచ్చ‌టించారు.  

2013వ సంవ‌త్స‌రం లో పెద్ద ఎత్తున వ‌ర‌ద‌లు వ‌చ్చి కొండ చ‌రియ‌లు విరిగిప‌డి దెబ్బ‌తిన్న‌టువంటి కేదార్‌నాథ్ ఆల‌యం ఆవ‌ర‌ణ లో ప్ర‌స్తుతం పున‌ర్ నిర్మాణ పనులు, అభివృద్ధి ప‌నులు భారీ ఎత్తు న జ‌రుగుతున్నాయి.


** 



(Release ID: 1552132) Visitor Counter : 128