ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్త‌ర భార‌త‌దేశం లో ఇసక తుఫాను బాధితుల‌కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపు ను ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 04 MAY 2018 7:55PM by PIB Hyderabad

ఉత్త‌ర భార‌త‌దేశం లోని వివిధ రాష్ట్రాల‌లో 2018 మే నెల 2వ తేదీన‌ ఇసక తుఫాను మరియు చక్రవాతం కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరికి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున మృతుల స‌ంబంధికులకు ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపు జరపాలని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రకటించారు. 

ఈ భీతావహ గాలి దుమారం లో తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి సైతం ప్ర‌తి ఒక్క‌రికి 50,000 రూపాయ‌ల వంతున చెల్లిపున‌కు కూడా ప్ర‌ధాన మంత్రి ఆమోదం తెలిపారు. 



(Release ID: 1531460) Visitor Counter : 134