విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హ్యూస్టన్‌లో ప్రవాస భారతీయులతో హిందీ దివస్‌ను జరుపుకున్న శ్రీ మనోహర్ లాల్


నాసా జాన్సన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన శ్రీ మనోహర్ లాల్‌..

జీ20 ఇంధన సమృద్ధి మంత్రుల సమావేశానికి ముందు భారతీయ ప్రవాసులతో భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 14 SEP 2026 1:07PM by PIB Hyderabad

 

అమెరికాలోని హ్యూస్టన్‌లో జీ20 ఇంధన సమృద్ధి మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన కేంద్ర విద్యుత్‌, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్‌ 2026 సెప్టెంబర్ 13న పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతీయ ప్రవాసులతో దేశ సాంస్కృతిక అనుబంధాన్ని చాటడంతో పాటు పర్యావరణ బాధ్యత పట్ల దేశ నిబద్ధతను, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారత్, అమెరికా సహకార విస్తరణను ఈ కార్యక్రమాలు ప్రతిబింబించాయి.

 

శ్రీ మనోహర్ లాల్‌ (13-09-2026) హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌, అంతర్జాతీయ హిందీ సంఘం–హ్యూస్టన్ చాప్టర్‌ సహకారంతో నిర్వహించిన హిందీ దివస్‌ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందీ భాషా గొప్పతనం, సమ్మిళితత్వం, వైవిధ్యాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ఈ సందర్భంగా ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి హిందీ భాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీ మనోహర్ లాల్‌ ప్రసంగిస్తూ.. హిందీ భాషను ప్రోత్సహించేందుకు, భారత్‌, భారతీయ ప్రవాసుల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చేస్తున్న కృషిని అభినందించారు.

 

భారత కాన్సులేట్ జనరల్‌ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద శ్రీ మనోహర్ లాల్‌ ఒక మొక్కను నాటారు. ‘‘స్వచ్ఛతా మే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్’’ అనే ఇతివృత్తంతో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా  కాన్సులేట్‌లో స్వచ్ఛతా హీ సేవా 2026 కార్యక్రమానికి కూడా ఈ మొక్కను నాటడం ద్వారా శ్రీకారం చుట్టారు. ప్రజల భాగస్వామ్యం, పర్యావరణ బాధ్యత విలువలను ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేసింది.

           

 13.09.2026 నాడు శ్రీ మనోహర్ లాల్‌ హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ అంతరిక్ష కేంద్రాన్ని కూడా సందర్శించారు. కేంద్రంలోని వివిధ సదుపాయాలను పరిశీలించిన ఆయన అంతరిక్ష రంగంలో భారత్–అమెరికా సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తనకు సాదర స్వాగతం పలికి, సందర్శన సందర్భంగా స్వయంగా మార్గనిర్దేశం చేసిన అంతరిక్ష కేంద్ర హ్యూస్టన్ అధ్యక్షుడు, సీఈఓ శ్రీ విలియం టీ హారిస్‌కు శ్రీ మనోహర్ లాల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

 

సాయంత్రం (13.09.2026) హ్యూస్టన్‌లోని ఇండియా హౌస్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో శ్రీ మనోహర్ లాల్‌ పాల్గొన్నారు. వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు, ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు సహా వివిధ వర్గాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాన్సుల్ జనరల్‌ శ్రీ డీసీ మంజునాథ్‌ శ్రీ మనోహర్ లాల్‌కు స్వాగతం పలికారు. జీ20 ఇంధన సమృద్ధి మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు హ్యూస్టన్‌ వచ్చిన సందర్భంగా భారతీయ ప్రవాసులతో శ్రీ మనోహర్ లాల్‌ జరిపిన పరస్పర సంభాషణను ఆయన అభినందించారు.

 

హరియాణ్వీ సమాజం తరఫున హరిత్‌ ప్రతినిధులు కూడా శ్రీ మనోహర్ లాల్‌తో సమావేశమయ్యారు. భారత్‌, అమెరికాల మధ్య ప్రజల మధ్య బలమైన, చిరకాల సంబంధాలను, అలాగే అమెరికా ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలకు భారతీయ ప్రవాసులు అందిస్తున్న విలువైన సహకారాన్ని మంత్రి ప్రశంసించారు.

 

2026 సెప్టెంబర్ 13న జరిగిన ఈ కార్యక్రమాలు జీ20 సహకారం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు, పర్యావరణ బాధ్యత, అధునాతన సాంకేతికత, అంతరిక్ష రంగాల్లో సహకారం వంటి భారత్–అమెరికా సంబంధాల బహుముఖ కోణాలను ప్రతిబింబించాయి.

 

రానున్న మూడు రోజుల్లో (14–16 సెప్టెంబర్ 2026) జీ20 ఇంధన సమృద్ధి మంత్రుల సమావేశంలో మంత్రి పాల్గొంటారు. ఇంధన భద్రత, అందుబాటు ధరలు, లభ్యత, మారుతున్న ప్రపంచ ఇంధన పరిస్థితులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు జీ20 సభ్య దేశాల మంత్రులు, సీనియర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. సురక్షితమైన, విశ్వసనీయమైన, అందుబాటు ధరల్లో లభించే, సుస్థిరమైన ఇంధనానికి సంబంధించిన పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు నిర్మాణాత్మక అంతర్జాతీయ సహకారం పట్ల దేశ నిబద్ధతను ఈ సమావేశంలో భారత్‌ పాల్గొనడం స్పష్టం చేస్తుంది.

 

****


(రిలీజ్ ఐడి: 2310213) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Tamil