ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా
ఆఫ్రికా సమాఖ్య చైర్పర్సన్, బురుండి దేశ అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2026 6:20PM by PIB Hyderabad
ఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆఫ్రికా సమాఖ్య చైర్పర్సన్, బురుండి దేశాధ్యక్షుడు ఎవరిస్టే ఎన్దాషిమియేతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
భారతదేశ అధ్యక్ష పదవీ కాలంలో 2023లో ఆఫ్రికా సమాఖ్య(ఏయూ) జీ20లో చేరే విషయంలో భారత్ పోషించిన పాత్రను ఇద్దరు నేతలు గుర్తు చేశారు. గ్లోబల్ సౌత్ పరిధిలో భారత్-ఆఫ్రికా సమాఖ్య భాగస్వామ్యం సహకారానికి ఒక ప్రధాన ఆధారమని వారు చెప్పారు. పరస్పరం అనుకూలమైన తేదీలో 4వ భారత్-ఆఫ్రికా ఫోరమ్ సదస్సును (ఐఏఎఫ్ఎస్-IV) త్వరలో నిర్వహించడం గురించి వారు చర్చించారు.
ఎబోలా వ్యాప్తిని విజయవంతంగా ఎదుర్కొనే విషయంలో ఏయూ నాయకత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టటంలో ఆఫ్రికా సీడీసీకి భారత్ అందించిన వైద్యపరమైన మద్దతును ఏయూ చైర్పర్సన్ ప్రశంసించారు.
సహృద్భావ వాతావరణం, ఐక్యత, ఉమ్మడి అభివృద్ధి ఆకాంక్షలతో ముడిపడి ఉన్న భారత్- బురుండి సంబంధాలను ఇద్దరు నేతలు చర్చించారు. ఆర్థిక సహకారం, అభివృద్ధి భాగస్వామ్యం, వ్యవసాయ ఆధునికీకరణ, ఆరోగ్య సంరక్షణ, సామర్థ్య పెంపు కార్యక్రమాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను వారు సమీక్షించారు.
***
(రిలీజ్ ఐడి: 2309888)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6