ఆయుష్
azadi ka amrit mahotsav

నాణ్యమైన ఆయుష్ సేవల కోసం పిలుపునిచ్చిన కేంద్రమంత్రి శ్రీ ప్రతాపరావ్ జాదవ్

ఆయుష్ వ్యవస్థ బలోపేతానికి నీతి ఆయోగ్ నేతృత్వంలో జాతీయ కార్యశాల

సదస్సులో పాల్గొన్న కేంద్రం, 30కి పైగా రాష్ట్రాలు, యూటీల ప్రతినిధులు

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 12:25PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండేలాప్రజలే కేంద్రంగానాణ్యమైన ఆయుష్ సేవలు అందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ (స్వతంత్ర హోదా), ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీ ప్రతాపరావ్ జాదవ్ కోరారుహైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో నిన్న నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయుష్ వ్యవస్థ బలోపేతంజాతీయ కార్యశాలలో ఆయన ప్రసంగించారు.

ఈ కార్యశాలలో కేంద్ర ప్రభుత్వం, 30కి పైగా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల నుంచి సీనియర్ అధికారులువివిధ సంస్థలకు చెందిన నిపుణులు సమావేశమయ్యారువారి అనుభవాలుఉత్తమ పద్ధతులుపరస్పర సహకార విధానాల ద్వారా ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేయటంపై చర్చించారు.

ఈ ప్రారంభ కార్యక్రమానికి శ్రీ ప్రతాపరావ్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారునీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య శాఖప్రొఫెసర్ (డాక్టర్ఎంశ్రీనివాస్ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా కూడా పాల్గొన్నారు.

శ్రీ ప్రతాపరావ్ జాదవ్ ప్రసంగిస్తూ... ఆయుష్ వ్యవస్థల విస్తృతినివాటి ప్రభావాన్ని మరింత పెంచేందుకు కేంద్రంరాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారుమారుతున్న ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత ఉండేలాప్రజలకు అందుబాటులో ఉండేలాప్రజలే కేంద్రంగా ఉండే విధానంపై ప్రత్యేకంగా దృషి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.

సమగ్ర ఆరోగ్య సంరక్షణలో సాంకేతికతసాక్ష్యాధారిత విధానాల ప్రాముఖ్యతను ప్రొఫెసర్ (డాక్టర్ఎంశ్రీనివాస్ స్పష్టం చేశారుదీనికి భారత్‌లోనే కాకప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచగలిగే సామర్థ్యం ఉందన్నారు.

ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేయటంలోక్షేత్రస్థాయిలో ఆయుష్ సేవలను సమర్థవంతంగా అందించటంలో రాష్ట్రాలుయూటీల కీలక పాత్రను వైద్య రాజేశ్ కొటేచా తెలియజేశారు.

ఆయుష్ ఆరోగ్య సేవలువిద్యపరిశోధనసామర్థ్య పెంపుఆరోగ్య వ్యవస్థతో విసృత అనుసంధానం వంటి కీలక రంగాల్లో అనుభవాలుఉత్తమ పద్ధతులువినూత్న విధానాలను పంచుకునేందుకు రాష్ట్రాలుయూటీలకు ఈ కార్యశాల వేదికగా నిలిచింది.

కేంద్రంరాష్ట్రాల సహకారంతో బలమైనప్రజలకు అందుబాటులో ఉండేప్రజలే కేంద్రంగా ఆయుష్ వ్యవస్థ ఏర్పాటుకుసంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందరికీ అందించాలనే ప్రభుత్వ దార్శనికతకు ఈ చర్చలు ప్రాధాన్యతనిచ్చాయి.

***


(రిలీజ్ ఐడి: 2308266) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Kannada