ప్రధాన మంత్రి కార్యాలయం
వడోదరలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 5:55PM by PIB Hyderabad
వడోదరలో కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోని విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వరుస పోస్టులలో ప్రధాని ఇలా పేర్కొన్నారు;
“2,800 కంటే ఎక్కువ కిలోమీటర్ల ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ ఇప్పుడు పూర్తయింది.
గతి శక్తికి, భారతదేశ లాజిస్టిక్స్ రంగ రూపాంతరానికి ఇదొక పెద్ద ఘట్టం.”
“భారతదేశం వీటిని నిర్మిస్తోంది:
చిప్స్ నుండి నౌకల వరకు... దేశంలోనే పూర్తి స్థాయి విలువ గొలుసులను అభివృద్ధి చేస్తోంది.
సౌర విద్యుత్ నుంచి అణు శక్తి వరకు.. కృత్రిమ మేధ (ఏఐ), డేటా సెంటర్లు, భవిష్యత్ పరిశ్రమల కోసం అవసరమైన ఇంధన వనరుల వ్యవస్థను సిద్ధం చేస్తోంది.”
(రిలీజ్ ఐడి: 2308005)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9