ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల సహకారాన్ని కొనియాడిన ప్రధానమంత్రి డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్‌కు నివాళులు అర్పించిన పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 05 SEP 2026 10:49AM by PIB Hyderabad

సమాజానికి ఉపాధ్యాయులు అందిస్తున్న అద్భుతమైన సేవలను అభినందించటమే ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేకత అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుడాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులు అర్పించే రోజు ఇదని తెలిపారు.

నిన్న లోక్‌కల్యాణ్ మార్గ్‌ (ఎల్‌కేఎం), 7కు జాతీయ ఉపాధ్యాయ అవార్డుల విజేతలను ఆహ్వానించిన సందర్భంగా జరిగిన సంభాషణలకు సంబంధించిన విశేషాలను ప్రధానమంత్రి పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో ప్రధానమంత్రి ఇలా పంచుకున్నారు.

"సమాజానికి ఉపాధ్యాయులు అందిస్తున్న అద్భుతమైన సేవలను అభినందించటమే ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేకతడాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులు అర్పించాల్సిన రోజు ఇది.

నిన్న ఎల్‌కేఎం, 7కు జాతీయ ఉపాధ్యాయ అవార్డుల విజేతలను ఆహ్వానించిన సందర్భంగా పలు విశేషాలను ఇక్కడ చూడండి".

 

***


(రిలీజ్ ఐడి: 2307100) సందర్శకుల సూచీ సంఖ్య : : 14