ప్రధాన మంత్రి కార్యాలయం
7, లోక్ కల్యాణ్ మార్గ్లో రక్షా బంధన్ వేడుకలు ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 AUG 2026 1:37PM by PIB Hyderabad
7, లోక్ కల్యాణ్ మార్గ్లో రక్షా బంధన్ వేడుకలకు సంబంధించిన కొన్ని స్మరణీయ క్షణాలను ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ పండుగ ప్రజల్లో అనురాగం, సద్భావనల బంధాలను బలపరచడంతో పాటు సంతోషాన్నీ, సౌభాగ్యాన్నీ, ఉత్సాహాన్నీ కూడా ప్రసాదించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు..:
‘‘7, లోక్ కల్యాణ్ మార్గ్లో రక్షా బంధన్ వేడుకలకు సంబంధించిన కొన్ని స్మరణీయ క్షణాలు..
ఈ పండుగ అనురాగం, సద్భావన బంధాలను బలపరచుగాక.
ప్రతి ఒక్కరికీ సంతోషాన్నీ, సౌభాగ్యాన్నీ అందించుగాక.
ఈ రోజు లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద జరిగిన రక్షా బంధన్ వేడుక సందర్భంగా... అభినందనలు, అమితానంద సంబరాలు ... ’’
(రిలీజ్ ఐడి: 2304216)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Malayalam
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil