ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఖేలో ఇండియా సంభాషణల ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 AUG 2026 9:30PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఖేలో ఇండియా సంభాషణలకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలను, దృశ్యాలను పంచుకున్నారు. ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులను, కేంద్ర కేబినెట్ సభ్యులను, ముఖ్యమంత్రులను, లక్షలాది మంది మై భారత్ వాలంటీర్లను ప్రధానమంత్రి హృదయపూర్వకంగా అభినందించారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని... దేశ యువతకు, యావత్ క్రీడా సమాజానికి ఆయన ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. "ఈ రోజు భరతమాత ముద్దుబిడ్డ మేజర్ ధ్యాన్ చంద్ గారి ని స్మరించుకోవలసిన రోజు" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

భారత ఒలింపిక్ ప్రస్థానానికి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. 

అందుకే, అత్యుత్తమ ప్రమాణాలపై దృష్టి సారించడానికి ఇదే సరైన సమయం. మేం చేస్తున్నదీ ఇదే...

క్రీడల సంబంధిత వైఖరిలో వచ్చిన మార్పును మీరు గమనించడం లేదా?


(రిలీజ్ ఐడి: 2304060) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Malayalam