ప్రధాన మంత్రి కార్యాలయం
తెలంగాణ.. సూర్యాపేటలో దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
26 AUG 2026 2:21PM by PIB Hyderabad
తెలంగాణ.. సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం సంభవించి ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
తెలంగాణ.. సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకొని బాధపడ్డాను. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2303560)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8