జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో ఇద్దరు మణిపూర్ వ్యక్తులపై జరిగిన భౌతిక దాడిని సుమోటోగా స్వీకరించిన భారత ఎన్‌హెచ్ఆర్‌సీ


తీవ్రంగా గాయపడిన ఒకరు విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం

ఈ ఘటనపై రెండు వారాల్లోగా నివేదిక అందించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసు జారీ చేసిన కమిషన్

प्रविष्टि तिथि: 19 AUG 2026 12:41PM by PIB Hyderabad

ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో ఇద్దరు మణిపూర్ వ్యక్తులపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లు వచ్చిన మీడియా కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీసుమోటోగా స్వీకరించిందిఈ ఘటనలో ఒకరికి తలకి తీవ్రంగా గాయాలవగాఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

వార్తా నివేదికలోని విషయాలు నిజమయితేఅది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశమని కమిషన్ గుర్తించిందిఈ ఘటనపై సమగ్ర నివేదికను రెండు వారాల్లోగా అందజేయాలని కోరుతూ ఢిల్లీ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసిందిదర్యాప్తు వివరాలతో పాటు గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను కూడా నివేదికలో చేర్చాలని తెలిపింది.

మీడియా నివేదిక ప్రకారం… చిన్న విషయంలో తలెత్తిన వివాదం వల్ల ఆగస్టు 14, 2026న బాధితులపై దాడి జరిగింది.

 

***


(रिलीज़ आईडी: 2301204) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Bengali-TR , Assamese , Tamil