పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆవాల జన్యు వనరుల నుంచి వచ్చిన రూ.15.52 కోట్ల ఏబీఎస్ నిధులను విడుదల చేసిన జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ


ఈ మొత్తాన్ని ఆవాల సాగు విస్తీర్ణం ఆధారంగా 26 రాష్ట్ర జీవవైవిధ్య బోర్డులు, 3 కేంద్రపాలిత ప్రాంత జీవవైవిధ్య మండళ్ల మధ్య పంపిణీ

प्रविष्टि तिथि: 13 AUG 2026 8:44AM by PIB Hyderabad

భారతదేశ జీవ వనరులను ఉపయోగించి పది వాణిజ్య రకాల ఆవాల (బ్రాస్సికా జున్సియాహైబ్రిడ్ వంగడాలను అభివృద్ధి చేసిన ఎంఎస్పయనీర్ ఓవర్సీస్ కార్పొరేషన్ నుంచి యాక్సెస్బెనిఫిట్ షేరింగ్ (ఏబీఎస్ద్వారా రూ.15.52 కోట్ల నిధులను జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏవిడుదల చేసిందిఆవాల సాగు విస్తీర్ణం ఆధారంగా ఈ మొత్తాన్ని 26 రాష్ట్ర జీవవైవిధ్య బోర్డులు (ఎస్ బీబీలు), 3 కేంద్రపాలిత ప్రాంత జీవవైవిధ్య మండళ్ల (యూటీబీసీలుమధ్య పంపిణీ చేయనున్నారు.

ఈ పది రకాలను ఎంఎస్పయనీర్ ఓవర్సీస్ కార్పొరేషన్ సంస్థలోనే అభివృద్ధి చేసినా… జన్యువులను మాత్రం బహిరంగ మార్కెట్లుట్రేడర్ల నుంచి సేకరించిందివనరులకు సంబంధించి ఏ ఒక్క రైతునువర్గాన్ని మూలంగా గుర్తించటానికి వీల్లేని సందర్భాల్లో ఏబీఎస్ నిధులను పంపిణీ చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించటానికి నిపుణుల కమిటీని ఎన్‌బీఏ ఏర్పాటు చేసింది.

నిపుణల కమిటీ సూచించిన విధివిధానాలను అథారిటీ ఆమోదించిందిదీని ప్రకారం.. మధ్యవర్తుల ద్వారా జీవ వనరులను సేకరించిన సందర్భాల్లోఆ వనరులను సాగు చేస్తున్న ఎస్‌బీబీలుయూటీబీసీల మధ్య ఏబీఎస్ వాటాను పంపిణీ చేయాలిరాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఐసీఏఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాపీసీడ్ మస్టర్డ్ రీసెర్చ్ నుంచి సాగు విస్తీర్ణానికి సంబంధించిన గణాంకాలను ఎన్‌బీఏ సేకరించిందిప్రతి రాష్ట్ర వాటాను లెక్కించేందుకు ఈ గణాంకాలను ఉపయోగించింది.

భారతదేశంలో 42 శాతం ఆవాల సాగు చేస్తున్న రాజస్థాన్ భారీగా ప్రయోజనాలను పొందుతోందిఆ తర్వాత వరుసలో ఉత్తరప్రదేశ్మధ్యప్రదేశ్ ఉన్నాయిదేశవ్యాప్తంగా ఆవాల సాగు విస్తరించటంతో ప్రతి రాష్ట్రంకేంద్రపాలిత ప్రాంతం సమానంగా వాటాను అందుకుంటున్నాయిఅత్యధికంగా ఏబీఎస్‌ను పొందుతున్న మొదటి పది రాష్ట్రాలు:


 

క్రమ సంఖ్య.

రాష్ట్రం

విడుదలైన నిధులు (రూకోట్లలో)

1.

రాజస్థాన్

6.43

2.

ఉత్తరప్రదేశ్

2.28

3.

మధ్యప్రదేశ్

1.86

4.

హర్యానా

1.21

5.

పశ్చిమబెంగాల్

1.10

6.

జార్ఖండ్

0.73

7.

అస్సాం

0.53

8.

గుజరాత్

0.48

9.

బీహార్

0.15

10.

పంజాబ్

0.08

11.

ఇతరులు

0.67


 

జీవవైవిధ్య చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం ప్రతి ఎస్‌బీబీయూటీబీసీ... ఏబీఎస్ మొత్తాన్ని వినియోగించాలిఇందులో సంరక్షణకు సంబంధించిన పనులుప్రజల జీవవైవిధ్య రిజిస్టర్లను డాక్యుమెంట్ చేయటంఅప్‌డేట్ చేయటంజీవవైవిధ్యాన్ని నివాస స్థానంలోనేఇతర ప్రాంతాల్లో పరిరక్షించటందెబ్బతిన్న ఆవరణ వ్యవస్థలను పునరుద్ధరించటంజీవవైవిధ్య వారసత్వ ప్రాంతాలను బలోపేతం చేయటంజీవవైవిధ్య నిర్వహణ కమిటీల సామర్థ్యాన్ని పెంపొందించటంజీవనోపాధిని మెరుగుపరచటం వంటి ఇతర కార్యకలాపాలు ఉంటాయి.

భారత జీవవైవిధ్య చట్టం-2002 ద్వారా ఎన్‌బీఏ చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఈ నిధుల విడుదల ఒక భాగంభారత జన్యు వనరుల ద్వారా వాణిజ్యపరమైన విలువను సృష్టించినప్పుడు ఆ లాభంలో కొంత మొత్తాన్ని జీవవైవిధ్యాన్ని కాపాడుతున్న రాష్ట్రాలుస్థానిక కమ్యూనిటీల సంక్షేమానికిపరిరక్షణకు వెచ్చించేలా చూడటం దీని ఉద్దేశంనగోయా ప్రోటోకాల్కున్మింగ్-మాంట్రియల్ ప్రపంచ జీవవైవిధ్య వ్యవస్థలోని టార్గెట్-13 ప్రకారం న్యాయమైనసమానమైన ప్రయోజనాల పంపిణీకి అనుగుణంగా ఇది ఉంటుంది.

ఇప్పటివరకు ఎన్‌బీఏ మొత్తం రూ.182.5 కోట్ల ఏబీఎస్ నిధులను విడుదల చేసిందిగత 12 నెలల్లోనే రూ.116.22 కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు అందించింది.

జాతీయ జీవవైవిధ్య అథారిటీ గురించి

జీవవైవిధ్య చట్టం-2002 ప్రకారం ఏర్పాటైన స్వయంప్రతిపత్తి గల సంస్థ జాతీయ జీవవైవిధ్య అధారిటీభారత ప్రభుత్వ పర్యావరణంఅటవీవాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుందిభారతదేశ జీవ వనరులువాటికి సంబంధించిన జ్ఞానాన్ని పొందే విధానాన్ని ఇది నియంత్రిస్తుందిప్రయోజనాలను న్యాయంగాసమానంగా పంచుకోవాలనే నగోయా ప్రోటోకాల్ సుత్రాన్ని అమలు చేస్తుంది.

 

****


(रिलीज़ आईडी: 2298844) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada