ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ ఆత్మకథను ఆగస్టు 12న ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి
ఆత్మకథ శీర్షిక: "ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్"
प्रविष्टि तिथि:
11 AUG 2026 1:22PM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ "ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్" శీర్షికతో ఉన్న పుస్తకాన్ని ఆగస్టు 12, 2026న ఉదయం 9:30 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.
భారత్లోని విశిష్టమైన ప్రముఖుల్లో ఒకరి జీవితాన్ని, దేశానికి ఆయన అందించిన సేవలను వేడుకగా జరుపుకునే ప్రత్యేక కార్యక్రమమే ఈ పుస్తకావిష్కరణ. మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ అసాధారణ జీవిత ప్రయాణాన్ని ఈ ఆత్మకథ వివరిస్తుంది. బాల్యంలోని రోజులను, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను, సాధించిన విజయాలను, ప్రజా జీవితాన్ని, దేశ 14వ రాష్ట్రపతిగా అందించిన సేవలను ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఆయన ప్రయాణం, ప్రజాసేవను తీర్చిదిద్దిన నైతిక విలువలు, అనుభవాలు, పరిస్థితులను వివరిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2297569)
आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Odia
,
English
,
Manipuri
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam