రక్షణ మంత్రిత్వ శాఖ
2026 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భారత వైమానిక దళ బ్యాండ్ ప్రదర్శన
प्रविष्टि तिथि:
08 AUG 2026 2:50PM by PIB Hyderabad
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని... న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్, పరం యోధా స్థల్ వద్ద పబ్లిక్ ప్లాజాలో ఆగస్టు 9, 2026న సాయంత్రం 5:00 గంటల నుంచి 6:00 గంటల వరకు భారత వైమానిక దళ బ్యాండ్ ప్రదర్శన జరుగుతుంది. జాతీయ గేయం 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ... ప్రజల భాగస్వామ్యంతో దేశభక్తిని, జాతీయ గౌరవాన్ని పెంపొందించటమే ఈ సంగీత ప్రదర్శన ఉద్దేశం.
వేదికపై ప్రదర్శన ఇచ్చేందుకు 32 మంది వైమానిక దళ సైనికులు, 8 మంది అగ్నివీర్వాయు (ముగ్గురు మహిళలతో సహా) సంగీతకారుల బృందం సిద్ధంగా ఉంది. ప్రేక్షకులకు మరువలేని అనుభూతిని కలిగించేలా ఈ సంగీతకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. దేశభక్తి, మనసును హత్తుకునే పాటలతో శక్తిమంతమైన ప్రదర్శన ద్వారా ఐఏఎఫ్ బ్యాండ్ దేశభక్తి భావాలను మరింత పెంచుతుంది.
ఈ కార్యక్రమానికి ప్రధాన సంగీత దర్శకుడిగా మాస్టర్ వారెంట్ ఆఫీసర్ ఎ. శ్రీహరి వ్యవహరిస్తారు. జూనియర్ వారెంట్ ఆఫీసర్ మూన్ దేకా, జూనియర్ వారెంట్ ఆఫీసర్ అభిషేక్ పాల్, సర్జెంట్ ఎన్టీ సింగ్ ఆయనకు సహాయకులుగా ఉంటారు.
***
(रिलीज़ आईडी: 2296632)
आगंतुक पटल : 5