ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశంలో వేగంగా ఎదుగుతున్న స్వయంసమృద్ధి వైద్య-సాంకేతిక వ్యవస్థపై కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 08 AUG 2026 1:35PM by PIB Hyderabad

 వైద్య సాంకేతిక (మెడ్-టెక్) రంగంలో భారత్‌ సాధిస్తున్న స్వయంసమృద్ధిపై కేంద్ర వైద్యశాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. దేశీయంగా వైద్య పరికరాల తయారీ పెరగడంతో పాటు,  దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గడం వల్లే ఈ రంగంలో ఈ అద్భుత ప్రగతి సాధ్యమైందని  ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వ పీఎల్ఐ (పీఎల్‌ఐ) పథకం, దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న మెడికల్ డివైజ్ పార్కులు ఈ మార్పునకు ప్రధాన కారణమని ఆయన చెప్పారు. సామాన్యుడికి సైతం తక్కువ ధరకే నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ధ్యేయంగా.. ప్రపంచవ్యాప్తంగా వైద్య సాంకేతిక రంగంలో భారత్‌ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధాని కొనియాడారు

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘దేశపు వైద్య సాంకేతిక (మెడ్-టెక్) రంగం వేగంగా స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా ప్రముఖంగా పేర్కొన్నారు. దేశీయంగా వైద్య పరికరాల ఉత్పాదకత పెరగడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పీఎల్ఐ పథకం, మెడికల్ డివైజ్ పార్కుల ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఈ రంగానికి కొండంత అండగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. సామాన్యుడికి సైతం అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ, అంతర్జాతీయ వేదికపై వైద్య సాంకేతిక రంగంలో భారతదేశం ఒక అత్యంత నమ్మకమైన భాగస్వామిగా స్థిరంగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి కొనియాడారు’’

 

https://hindustantimes.com/opinion/indias-march-towards-self-reliance-in-medtech-101786121787652.html


(रिलीज़ आईडी: 2296528) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Malayalam