యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మై భారత్ ద్వారా యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. డిజిటల్ వేదికలో 2.46 కోట్లకు పైగా రిజిస్ట్రేషనలు


కృత్రిమ మేధ ఆధారిత సీవీ బిల్డర్, అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాలు, సీఎస్‌సీ అనుసంధానం ద్వారా యువతకు అపార అవకాశాలు

प्रविष्टि तिथि: 06 AUG 2026 4:19PM by PIB Hyderabad

మై భారత్ వేదిక ద్వారా దేశంలో యువత సాధికారతను బలోపేతం చేసేందుకు కేంద్ర క్రీడలుయువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ  కృషి చేస్తోందికృత్రిమ మేధ ఆధారిత డిజిటల్ సేవలుఅనుభవపూర్వక అభ్యాస అవకాశాలుగ్రామీణసుదూర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల ద్వారా యువతకు కొత్త అవకాశాలను అందిస్తోందిఈ వేదిక ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 2.46 కోట్లకు పైగా యువత తమ పేర్లను నమోదు చేసుకోగా, 1.22 లక్షలకు పైగా  మంది దాదాపు 25,000 అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాల్లో చేరారురాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల వారీగా నమోదైన వివరాలను అనుబంధంలో పొందుపరిచారు.

 

యువతకు సాంకేతిక చేయూతనందించేందుకు ఈ వేదికలో ఏఐ ఆధారిత సీవీ బిల్డర్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారుముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలుఆకాంక్షాత్మక జిల్లాల్లోని యువతకు స్వచ్ఛంద సేవలునైపుణ్యాభివృద్ధిఇంటర్న్‌షిప్‌లునాయకత్వ అవకాశాలను సులభంగా అందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 780కి పైగా జిల్లా యువజన కార్యాలయాలుఉమ్మడి సేవా కేంద్రాల (కామన్ సర్వీస్ సెంటర్లు-సీఎస్‌సీవ్యవస్థను మంత్రిత్వ శాఖ సమర్థవంతంగా వినియోగిస్తోంది.

 

మై భారత్ వేదిక ద్వారా దేశంలోని యువతకు వివిధ రంగాలలో కేంద్ర ప్రభుత్వం ప్రాక్టికల్ శిక్షణను అందిస్తుందిప్రభుత్వ విభాగాలుప్రభుత్వ సంస్థలువిద్యా సంస్థలుభాగస్వామ్య సంస్థల సహకారంతో అనుభవపూర్వక అభ్యసన కార్యక్రమాలను నిర్వహిస్తుందిఈ వేదిక ద్వారా తపాలా శాఖజన్ ఔషధిసేవా సే సీఖేన్ప్రజా పంపిణీ వ్యవస్థసడక్ సురక్ష మిత్రరేడియో ప్రొడక్షన్రైతు ఉత్పత్తిదారుల సంస్థలువయోవృద్ధుల సంరక్షణ కేంద్రాలుసెమీకండక్టర్ శిక్షణ కార్యక్రమ వంటి అనేక రంగాల్లో స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారుఈ కార్యక్రమాలు వివిధ రంగాల్లో 20 నుంచి 360 గంటల వ్యవధితో స్వల్పకాలిక ప్రాక్టికల్ శిక్షణ అవకాశాలను అందిస్తాయిమై భారత్‌ వేదిక ప్రారంభమైనప్పటి నుంచి 1.22 లక్షల మందికి పైగా యువత దాదాపు 25,000 అనుభవాత్మక అభ్యసర కార్యక్రమాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారుశిక్షణ పూర్తి చేసుకున్న వారికి మై భారత్ వేదిక ద్వారా డిజిటల్ ధ్రువీకరణ కలిగిన పత్రాలను జారీ చేశారు.

 

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యువతకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు మై భారత్ వేదికగా ప్రత్యేక స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2026 జూలై 16 నాటికి మై భారత్ వేదిక ద్వారా నమోదుదరఖాస్తు ప్రక్రియ కోసం 98,632 మంది యువత పీఎంఐఎస్‌ వేదికకు మళ్లించారు.

 

మై భారత్‌ వేదికలో డిజిటల్ సేవల పంపిణీని మెరుగుపరచడానికి కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగిస్తున్నారుపనితీరునుసేవా ప్రమాణాలను  పెంపొందించేందుకు సాఫ్ట్‌వేర్ అభివృద్ధిడాక్యుమెంటేషన్సమాచార నిర్వహణకార్యక్రమాల పర్యవేక్షణలో ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగిస్తున్నారుప్రత్యేకించి భాషిణి భాగస్వామ్యంతో యువత కోసం కృత్రిమ మేధ ఆధారిత సీవీ బిల్డర్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

 

పట్టణాలుగ్రామీణ ప్రాంతాలుఆకాంక్షాత్మక జిల్లాల్లోని యువతకు సేవలను చేరువ చేసేందుకు ప్రభుత్వం ఫిజిటల్ (భౌతిక+డిజిటల్విధానాన్ని అమలు చేస్తోందిదేశవ్యాప్తంగా ఉన్న 780కి పైగా జిల్లా యువజన కార్యాలయాల వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను అమలు చేస్తున్నారుయువజన క్లబ్‌లువిద్యాసంస్థలుఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలుప్రభుత్వ విభాగాలుస్వచ్ఛంద సంస్థలువ్యాపార భాగస్వామ్యాలతో కలిసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారుడిజిటల్ సదుపాయాలు లేని గ్రామీణసుదూర ప్రాంతాల యువతకు సహాయపడేందుకు మై భారత్ వేదిక ఉమ్మడి సేవా కేంద్రాల వ్యవస్థతో అనుసంధానించారుదీనివల్ల గ్రామస్థాయి పారిశ్రామికవేత్తల సాయంతో యువత సులభంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చుజిల్లామండలపంచాయతీగ్రామ స్థాయిల్లో లోకేషన్ ఆధారిత స్వచ్ఛంద సేవలుఅనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా అందిస్తున్నారుదీనివల్ల యువత తమ నివాస ప్రాంతాలకు దగ్గరలోనే ఉన్న అవకాశాలలో పాల్గొంటూ నాయకత్వ పటిమనుసమాజ సేవను పెంపొందించుకుంటున్నారు.

 

అనుబంధం

రాష్ట్రంకేంద్రపాలిత ప్రాంతాల వారీగా  మై భారత్‌ వేదికలో నమోదు వివరాలు

రాష్ట్రంకేంద్రపాలిత ప్రాంతం

మొత్తం నమోదు సంఖ్య

అండమాన్‌నికోబార్‌ దీవులు

28794

ఆంధ్రప్రదేశ్‌

814350

అరుణాచల్‌ ప్రదేశ్‌

46277

అస్సాం

646655

బిహార్‌

691531

చండీగఢ్‌

77271

చత్తీస్‌గఢ్‌

565384

ఢిల్లీ

680862

గోవా

52322

గుజరాత్‌

928092

హర్యానా

755169

హిమాచల్‌  ప్రదేశ్‌

303408

జమ్ముకశ్మీర్‌

862526

జార్ఖండ్‌

346639

కర్ణాటక

817057

కేరళ

586790

లడఖ్‌

39653

లక్ష్యదీప్‌

6452

మధ్యప్రదేశ్‌

1432089

మహారాష్ట్ర

1518436

మణిపూర్‌

42648

మేఘాలయ

50376

మిజోరాం

69977

నాగాలాండ్‌

45104

ఒడిశా

592246

పుదుచ్చేరి

85275

పంజాబ్‌

625705

రాజస్థాన్‌

2039230

సిక్కిం

47643

తమిళనాడు

1502286

తెలంగాణ

403426

దాద్రా నగర్‌ హవేలీ

23005

త్రిపుర

123306

ఉత్తర ప్రదేశ్‌

2506907

ఉత్తరాఖండ్‌

317906

పశ్చిమ బెంగాల్‌

849514

రాష్ట్రం పేరు లేదు

4127831

మొత్తం

24652142

ఈ సమాచారాన్ని గురువారం రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు యువజన వ్యవహారాలుక్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.

 

***


(रिलीज़ आईडी: 2295756) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati