సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎంఎస్ఎంఈ సుస్థిరతా (జెడ్ - జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్) ధ్రువీకరణ: నాణ్యత, సుస్థిరత, మహిళా సారథ్యంలోని సంస్థల బలోపేతం

మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత: మహిళల సారథ్యంలోని ఎంఎస్ఎంఈలకు జెడ్ ధ్రువీకరణపై 100% రాయితీని అందిస్తున్న ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ

అంతర్జాతీయంగా పోటీతత్వానికి ఊతమిచ్చేలా.. జెడ్ ధ్రువీకరణను సాధించిన 6.7 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు

జెడ్ ధ్రువీకరణ విప్లవాత్మక సానుకూల ప్రభావాన్ని చాటుతున్న విజయగాథలు

प्रविष्टि तिथि: 04 AUG 2026 11:22AM by PIB Hyderabad

ఫినెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ – జెడ్ఈడీతో నాణ్యతసుస్థిరత దిశగా పురోగతి

మహారాష్ట్ర నాసిక్‌లోని దిండోరీ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఫినెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోహకలప ఫర్నిచర్‌ను తయారుచేస్తోందిఈ సంస్థ 2025 జూలై 14న జెడ్ సిల్వర్ ధ్రువీకరణను సాధించిందిఅనంతరం నాణ్యతా లోపాల వ్యయాన్ని 11 శాతంతిరిగి పని చేయడాన్ని 10 శాతంలోపాలను శాతం మేర తగ్గించుకోవడమే కాకుండా.. పని ప్రదేశంలో భద్రతనూవనరుల వినియోగాన్నీ మెరుగుపరచుకుందిమెరుగైన విద్యుత్ సామర్థ్యంస్థలాన్ని సద్వినియోగం చేసుకోవడంవస్తువుల వాడకాన్ని తగ్గించడం ద్వారా గణనీయమైన పొదుపును కూడా సాధించిందిజెడ్ ధ్రువీకరణ వల్ల ఉత్పాదకతఉత్పత్తుల నాణ్యతకార్యాచరణ సామర్థ్యం పెరిగాయని సంస్థ తెలిపిందిఎంఎస్ఎంఈలు సుస్థిర పద్ధతుల్లో అభివృద్ధి చెందేందుకుపోటీతత్వ సమర్థతను పెంపొందించుకునేందుకు ‘లోప రాహిత్యంపర్యావరణ హితం (జీరో డిఫెక్ట్జీరో ఎఫెక్ట్)’ విధానాలు దోహదపడుతున్న తీరును ఇది ప్రతిబింబిస్తోంది.

కాన్సెప్ట్ క్లాథింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జెడ్ ద్వారా నాణ్యతసామర్థ్యాల బలోపేతం

పంజాబ్‌లోని జలంధర్ కేంద్రంగా పనిచేసే కాన్సెప్ట్ క్లోథింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2025 జూన్ 14న జెడ్ సిల్వర్ ధ్రువీకరణను సాధించి.. నాణ్యతసుస్థిరతకార్యాచరణ నైపుణ్యాల పట్ల నిబద్ధతను చాటుకుందిజెడ్ విధానాలను అమలు చేసిన తర్వాత ప్రమాదాల సంఖ్యను 80 శాతంసగటు మరమ్మతు సమయాన్ని 50 శాతంతిరిగి చేసే పని చేయాల్సిన పరిస్థితులను 7.4 శాతంఉత్పత్తుల తిరస్కరణను శాతం మేర తగ్గించుకున్నట్లు సంస్థ తెలిపిందిఅంతేకాకుండా నాణ్యతపర్యావరణంపని ప్రదేశాల్లో అభివృద్ధి చర్యల ద్వారా గణనీయమైన పొదుపును సాధించిందిజెడ్ ధ్రువీకరణ వల్ల సంస్థలో క్రమశిక్షణవివిధ ప్రక్రియల్లో సమర్థత పెరగడంతోపాటు పోటీతత్వం మెరుగైందని తెలిపిందిఎంఎస్ఎంఈల్లో ‘లోప రాహిత్యంపర్యావరణ హితం (జీరో డిఫెక్ట్జీరో ఎఫెక్ట్)’ విధానాల విలువను ఇది స్పష్టం చేస్తోంది.

లోపరాహిత్యంపర్యావరణ హితం (జెడ్ధ్రువీకరణతో ఎంఎస్ఎంఈల బలోపేతం

ఎంఎస్ఎంఈ సుస్థిరతా జెడ్ ధ్రువీకరణ పథకం ద్వారా.. నాణ్యతతో కూడినపర్యావరణ హిత తయారీ రంగాన్ని సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రోత్సహిస్తోందిఉత్పత్తి ప్రక్రియలను మెరుగుపరచుకోవడానికిమెరుగైన నాణ్యత ప్రమాణాలను పాటించడానికిపర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ కార్యక్రమం ఎంఎస్ఎంఈలకు దోహదపడుతుందితద్వారా దేశీయఅంతర్జాతీయ మార్కెట్లలో వాటి పోటీతత్వాన్ని బలోపేతం చేస్తుంది.

నాణ్యమైనసుస్థిర తయారీ రంగంలో మహిళా పారిశ్రామికవేత్తల అధిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తుందిమహిళల సారథ్యంలోని సంస్థలకు ఎదురయ్యే వ్యయపరమైన అడ్డంకులను తగ్గించడం కోసం.. మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు జెడ్ ధ్రువీకరణ ఖర్చుపై 100 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. 2023 నవంబరు 11 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చిందిమహిళల యాజమాన్యంలోని అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలకు ధ్రువీకరణ కోసం ఎలాంటి ఖర్చూ ఉండదు.

 

image.jpeg

image.jpeg

నాణ్యతఉత్పాదకతభద్రతపర్యావరణ సుస్థిరతలకు సంబంధించి గురింపు పొందిన ప్రమాణాలకు అనుగుణంగా మహిళా పారిశ్రామికవేత్తలు తమ తయారీ వ్యవస్థలను సమీక్షించుకోవడంతోపాటు.. మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ సహాయం ద్వారా వీలు కలుగుతుందినిర్దిష్టమైన మదింపుధ్రువీకరణలకు అవకాశాన్ని కల్పించడం ద్వారా.. మహిళల సారథ్యంలోని పరిశ్రమలు మెరుగైన పనివిధానాలను తీర్చిదిద్దుకోవడానికిమార్కెట్టులో విశ్వసనీయతను పెంచుకోవడానికివిస్తృతమైన వ్యాపార అవకాశాలను అందుకునేలా సంసిద్ధమవడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.

నేపథ్యం

ఎంఎస్ఎంఈలు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపకుండా అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేలా లోప రాహిత్యంపర్యావరణ హితం (జీరో డిఫెక్ట్జీరో ఎఫెక్ట్ జెడ్కార్యక్రమం ప్రోత్సహిస్తుందినాణ్యతఉత్పాదకతసుస్థిరతలను పెంచుకోవడానికి వీలుగా తమ సాంకేతికతవ్యవస్థలుతయారీ విధానాలను నిరంతరం మెరుగుపరుచుకోవడంలో పరిశ్రమలకు ఇది తోడ్పడుతుంది. ‘జెడ్’ కేవలం ఒక ధ్రువీకరణ కార్యక్రమం మాత్రమే కాదు.. మదింపునాణ్యతలో మెరుగుదలప్రోత్సాహకాలుసాంకేతికత ఆధునికీకరణ దిశగా ఎంఎస్ఎంఈలకు ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తుందిఈ ధ్రువీకరణ విధానంలో కాంస్యరజతస్వర్ణ అనే స్థాయులుంటాయిదీనివల్ల పరిశ్రమలు క్రమక్రమంగా ఉన్నతమైన నాణ్యతసుస్థిరతా ప్రమాణాలను అందుకోవడానికి వీలవుతుందిఅర్హత కలిగిన ఎంఎస్ఎంఈలు పరీక్షవ్యవస్థాపరమైనఉత్పత్తి ధ్రువీకరణ వ్యయంలో 75 శాతం వరకు (గరిష్టంగా రూ. 50,000) ఆర్థిక సాయాన్ని పొందవచ్చుఅలాగే ప్రత్యక్ష మార్గదర్శకత్వంసలహా సేవల కోసం రూ. 2 లక్షల వరకూపర్యావరణ హిత మార్గాలుకాలుష్య నియంత్రణ చర్యలుశుద్ధ సాంకేతికతల కోసం రూ. 3 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు.

విస్తరిస్తున్న పరిధివిస్తృత ప్రభావం

సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమల్లో నాణ్యతసుస్థిరతపోటీతత్వాలను పెంచడంలో ఎంఎస్ఎంఈ సుస్థిరతా (జెడ్ధ్రువీకరణ పథకం కీలక ఉత్ప్రేరకంగా ఎదుగుతోంది. 2026 జూలై నాటికి ఈ పథకం కింద దాదాపు 9.49 లక్షల ఎంఎస్ఎంఈలు నమోదు చేసుకున్నాయివీటిలో 6.67 లక్షలకు పైగా సంస్థలు కాంస్య, 6,700కు పైగా సంస్థలు రజత, 4,800కు పైగా సంస్థలు స్వర్ణ ధ్రువీకరణ పత్రాలను పొందాయిపరిశ్రమలు నాణ్యమైనసుస్థిరమైన తయారీ విధానాలను అందిపుచ్చుకొనేలా.. ఈ కార్యక్రమం ఇప్పటివరకు రూ. 913 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని అందించింది.

జెడ్ ధ్రువీకరణ సానుకూల ప్రభావం ధ్రువీకరణకు మాత్రమే పరిమితం కాలేదు. 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ పారిశ్రామిక విధానాలతో జెడ్‌ను అనుసంధానించి.. ధ్రువీకరించిన ఎంఎస్ఎంఈలకు అదనపు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయిఅంతేకాకుండా 19 ఆర్థిక సంస్థలు ప్రాసెసింగ్ ఫీజులువడ్డీ రేట్లలో రాయితీల వంటి ప్రయోజనాలను అందిస్తూ.. జెడ్ ధ్రువీకరణ పొందిన సంస్థలకు ఆర్థికసాయాన్ని సులభంగా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయిమహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు జెడ్ ధ్రువీకరణపై 100 శాతం సబ్సిడీని అందించడం ఈ పథకంలో ఒక ముఖ్యమైన అంశంఇది వ్యయపరమైన అవరోధాన్ని తొలగించిమహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందినాణ్యమైన తయారీవనరుల సామర్థ్యంపర్యావరణ సుస్థిరతలను ప్రోత్సహించడం ద్వారా.. ఎంఎస్ఎంఈలు పోటీతత్వాన్నీమార్కెట్ విశ్వసనీయతను పెంచుకోవడానికీదేశీయంగానూఅంతర్జాతీయంగానూ అన్ని దశల్లోనూ మరింత సమర్థంగా ఏకీకృతం కావడానికీ జెడ్ దోహదపడుతుంది.

వివరాల కోసం వెబ్‌సైటును సందర్శించండి https://zed.msme.gov.in/

 

***


(रिलीज़ आईडी: 2294440) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Tamil