ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మహిళల బాక్సింగ్‌ 75 కిలోల విభాగంలో రజత పతక విజేత లవ్లీనా బోర్గ్‌హెయిన్‌కు ప్రధానమంత్రి ప్రశంస

प्रविष्टि तिथि: 02 AUG 2026 12:59AM by PIB Hyderabad

   గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన లవ్లీనా బోర్గ్‌హెయిన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ పోటీలో తొలి రౌండ్‌ నుంచే తన అద్భుత నైపుణ్యాన్ని, పట్టుదలను ఆమె చాటుకున్నదని ఆయన కొనియాడారు.

ఈ ఘనత సాధించడంపై అభినందిస్తూ- ఆమె అంకితభావం, నిలకడ దేశంలోని ఔత్సాహిక క్రీడాకారులకు సదా స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:

“మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గ్‌హెయిన్‌ సాధించిన రజత పతకం నాతోపాటు దేశ ప్రజానీకం హృదయాల్లో ఆనందోత్సాహాలు నింపింది. ఈ పోటీల్లో ఆదినుంచీ అపార నైపుణ్యంతో దూసుకెళ్తూ వచ్చిన ఆమెకు నా అభినందనలు. లవ్లీనా అంకితభావం, ప్రతిభా ప్రదర్వనలో నిలకడ దేశంలోని ఔత్సాహిక క్రీడాకారులకు సదా స్ఫూర్తినిస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.




**************


MJPS/SS/ST


(रिलीज़ आईडी: 2293249) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Gujarati , Malayalam