ప్రధాన మంత్రి కార్యాలయం
మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం
‘వివేక స్మారక’ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం ముఖ్యాంశాలు
प्रविष्टि तिथि:
02 AUG 2026 12:38AM by PIB Hyderabad
కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం- ‘వివేక స్మారక’ ప్రారంభోత్సవం సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా వరుస సందేశాలు పంపారు:
“స్వామి వివేకానంద జీవితంలో మైసూర్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మెరుగైన సమాజానికి రూపుదిద్దడంలో భాగస్వాములయ్యేలా యువతను ఉత్తేజితం చేయగల శక్తిమంతమైన కేంద్రంగా ‘వివేక స్మారక’ నిలుస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.”
స్వామి వివేకానంద జీవితంలో మైసూర్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
మెరుగైన సమాజానికి రూపుదిద్దడంలో భాగస్వాములయ్యేలా యువతను ఉత్తేజితం చేయగల శక్తిమంతమైన కేంద్రంగా ‘వివేక స్మారక’ నిలుస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. pic.twitter.com/zEnyDGIACK
- నరేంద్ర మోదీ (@narendramodi) 2026 ఆగస్టు 1.
“మన యువతరం శక్తిసామర్థ్యాల స్ఫూర్తితో భారత్ వివిధ రంగాల్లో గణనీయ ప్రగతి సాధిస్తోంది. ‘స్వయంసమృద్ధ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాల విజయంలో నిస్సందేహంగా మన యువతలో ఉప్పొంగే ఉత్సాహమే ప్రధానచోదకం.”
“మన యువతరం శక్తిసామర్థ్యాల స్ఫూర్తితో భారత్ వివిధ రంగాల్లో గణనీయ ప్రగతి సాధిస్తోంది. ‘స్వయంసమృద్ధ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాల విజయంలో నిస్సందేహంగా మన యువతలో ఉప్పొంగే ఉత్సాహమే ప్రధానచోదకం.”
- నరేంద్ర మోదీ (@narendramodi) 2026 ఆగస్టు 1.
“ప్రస్తుత 21వ శతాబ్దపు అవసరాలు-ఆకాంక్షలకు మేరకు మన ‘జాతీయ విద్యా విధానం’ దేశ యువతను తీర్చదిద్దుతుండటం నాకు ఎనలేని సంతోషాన్నిస్తోంది.”
“ప్రస్తుత 21వ శతాబ్దపు అవసరాలు-ఆకాంక్షలకు మేరకు మన ‘జాతీయ విద్యా విధానం’ దేశ యువతను తీర్చదిద్దుతుండటం నాకు ఎనలేని సంతోషాన్నిస్తోంది.”
- నరేంద్ర మోదీ (@narendramodi) 2026 ఆగస్టు 1.
*********
MJPS/SS/ST
(रिलीज़ आईडी: 2293243)
आगंतुक पटल : 4