మంత్రిమండలి
azadi ka amrit mahotsav

‘సముద్ర మంథన్’ పథకానికి రూ.84,084 కోట్ల బడ్జెట్‌తో మంత్రిమండలి ఆమోదం

प्रविष्टि तिथि: 31 JUL 2026 4:17PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ ‘సముద్ర మంథన్జాతీయ సముద్రాంతర అన్వేషణ’ పథకానికి ఆమోదముద్ర వేసిందిపెట్రోలియం-సహజ వాయువుల మంత్రిత్వశాఖ పరిధిలో మొత్తం రూ.84,084 కోట్లతో 2030-31 వరకు ఈ కేంద్ర రంగ పథకం అమలవుతుంది.

భారత అపార సముద్ర గర్భ ఇంధన సామర్థ్య సద్వినియోగం కోసం 2025లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట పైనుంచి ప్రధానమంత్రి ప్రకటించిన ఆధునిక సముద్రాన్వేషణ దృక్కోణానికి ఈ పథకం ఒక ప్రతీకదేశ ఇంధన భద్రత బలోపేతందేశీయ అన్వేషణ-ఉత్పత్తి పెంపుసాంకేతిక ముందంజకు ప్రోత్సాహంవికసిత భారత్ సంకల్పం దిశగా ప్రస్థానంలో ఇదొక కీలక మలుపు.

సముద్రాంతర్భాగంలో అన్వేషణ విలువ వ్యవస్థ మొత్తం ఈ పథకం పరిధిలో సమగ్ర కార్యకలాపాలు చేపడతారుఇందులో భాగంగా అధిక-నాణ్యత గల భూకంప సమాచార విస్తృత సేకరణ-పరిశీలన-విశ్లేషణ చేస్తారుఅలాగేలోతైన-అత్యంత లోతైన జలాల్లో అన్వేషణాత్మక తవ్వకాన్ని ముమ్మరం చేయడం సహా కొత్త బేసిన్లలో శాస్త్రీయ డ్రిల్లింగ్ఉమ్మడి సముద్రాంతర ఉత్పాదన-తరలింపు మౌలిక సదుపాయాల కల్పనసమీకృత చమురు-గ్యాస్ తయారీసేవల మండలి ఏర్పాటు వంటి వాటికీ ఈ పథకం వీలు కల్పిస్తుందిదేశంలో సముద్రాంతర అన్వేషణ-ఉత్పత్తిని ముమ్మరం చేయగల సమీకృత వ్యవస్థ సృష్టిడిజిటల్ ప్రోగ్రామ్ నిర్వహణసామర్థ్య వికాసంసాంకేతిక పరిజ్ఞాన స్వీకరణవాటాదారుల భాగస్వామ్యం సహా అంతర్జాతీయంగా విస్తరణ దిశగానూ ఇందులో ప్రత్యేక వెసులుబాట్లు ఉన్నాయి.

ఈ పథకం 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురుకు సమానమైన నిల్వల  పెరుగుదలకు దోహదం చేస్తుందనిసముద్రాంతర్భాగంలో అన్వేషణ కార్యకలాపాలను గణనీయంగా పెంచుతుందనిదేశీయ చమురు-గ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందనిపెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తుందని అంచనాఅంతేకాకుండా మేక్ ఇన్ ఇండియాస్వయంసమృద్ధ భారత్ కింద దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు సముద్రాంతర సాంకేతికతలు-సేవల రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల వ్యవస్థ రూపకల్పనకు తోడ్పడుతుందని భావిస్తున్నారుఅన్వేషణ-ఉత్పత్తి విలువ శ్రేణి అంతటా గణనీయ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ పారిశ్రామికఆవిష్కరణఆర్థిక వృద్ధికి దీర్ఘకాలిక అవకాశాలను సృష్టించగలదని ఆశిస్తున్నారు.

అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరీకరణ వైపు భారత్‌ వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో సముద్ర మంథన్ ఒక పరిణామాత్మక జాతీయ కార్యక్రమంగా నిలుస్తుందిదేశంలోని సముద్రతీర ఇంధన వనరుల వెలికితీతదీర్ఘకాలిక ఇంధన భద్రత బలోపేతంసాంకేతిక సామర్థ్యాల పెంపుఆర్థిక వ్యవస్థతోపాటు భావితరాలకు శాశ్వత విలువ సృష్టి తదితరాలకు దోహదం చేయగలదు.

మొత్తం మీద గడచిన దశాబ్దంలో ప్రభుత్వం అప్‌స్ట్రీమ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిందిఇందులో భాగంగా దాదాపు మొత్తం ఆఫ్‌షోర్ ప్రాంత అన్వేషణకు అనుమతించిందిశాసన-ఒప్పంద చట్రం ఆధునికీకరణజాతీయ డేటా భాండాగార బలోపేతం వంటివి అమలు చేసిందిఈ సంస్కరణలు ప్రాతిపదికగా వ్యూహాత్మక ప్రభుత్వ పెట్టుబడిఅత్యాధునిక సాంకేతికతలుఅంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల ద్వారా ఆఫ్‌షోర్ అన్వేషణను ముమ్మరం చేయడంలో సముద్ర మంథన్ పథకం నవ శకానికి నాంది పలకనుంది.

 

***


(रिलीज़ आईडी: 2292562) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Marathi , Assamese , Bengali , Odia , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada