జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆగస్టు 3న ఐఐటీ ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించనున్న కేంద్రమంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్


పరిశోధన, ఆవిష్కరణలు, డిజిటల్ సాంకేతికతల ద్వారా భారతదేశ చేనేత రంగాన్ని బలోపేతం చేయటానికి... పోటీతత్వాన్ని, స్థిరత్వాన్ని, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పెంపొందించేందుకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

प्रविष्टि तिथि: 30 JUL 2026 3:36PM by PIB Hyderabad

 సాంకేతికంగా మెరుగైన చేేనేత వ్యవస్థను ఏర్పరిచే దిశగా ఆగస్టు 3, 2026న ఐఐటీ ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (సీఓఈ-హెచ్‌టీ)ని కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రారంభిస్తారుకేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి శ్రీ పబిత్ర మార్గరిటాజౌళి శాఖ కార్యదర్శి శ్రీమతి నీలం షామీ రావుఅభివృద్ధి కమిషనర్ (చేనేతడాక్టర్ ఎంబీనాతో పాటు జౌళి మంత్రిత్వ శాఖఐఐటీ ఢిల్లీ ఉన్నతాధికారులు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొంటారు.

భారత ప్రభుత్వం రూ.11.99 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.. భారతదేశ సుసంపన్న చేనేత వారసత్వాన్ని అత్యాధునిక పరిశోధనలుఆవిష్కరణలుడిజిటల్ సాంకేతికతతో అనుసంధానించటం ద్వారా పోటీతత్వాన్నిస్థిరత్వాన్నిప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుందివిద్యా సంస్థలుపరిశ్రమలుడిజైనర్లుసాంకేతిక నిపుణులుఅంకుర సంస్థలుచేనేత సంస్థలను ఒకచోట చేర్చిఈ రంగానికి మెరుగైన పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు జాతీయ విజ్ఞానఆవిష్కరణ కేంద్రంగా పనిచేస్తుందిమగ్గాల ఆధునీకరణఎర్గోనామిక్స్కృత్రిమ మేధసుస్థిరతక్రియాత్మక ఆవిష్కరణలుడిజిటల్ విజ్ఞాన వ్యవస్థలువ్యవస్థాపకతపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

రాబోయే ఐదేళ్లలో చేనేత పరిజ్ఞానానికి సంబంధించిన జాతీయ డిజిటల్ రిపోజిటరీని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఏఐ ఆధారిత పరికరాలను రూపొందించటంమెరుగైన మగ్గాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటంపేటెంట్లుపరిశోధనలకు మద్దతివ్వటంఅంకుర సంస్థలను ప్రోత్సహించటందేశవ్యాప్తంగా చేనేత కార్మికులుఅధ్యాపకులు, చేనేత నిపుణులకు ఇది శిక్షణనిస్తుంది.

భారతదేశ సుసంపన్నమైన నేత సంప్రదాయాలను పరిరక్షిస్తూనే.. చేనేత రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం కీలకంగా నిలుస్తుందిపరిశోధనఆవిష్కరణవ్యవస్థాపకతను ప్రోత్సహించటం ద్వారా ఈ కేంద్రం నేత కార్మికులకు సాధికారత కల్పించిఉత్పాదకతను పెంచిసుస్థిర పద్ధతులను ప్రోత్సహించిదేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న నూతన అవకాశాలకు భారతీయ చేనేతను సన్నద్ధం చేసే పటిష్టమైన వ్యవస్థను సృష్టిస్తుందని ఆశిస్తున్నారు.

భారతదేశ చేనేత రంగం 35 లక్షలకు పైగా నేత కార్మికులకుఅనుబంధ కార్మికులకు ఉపాధి కల్పిస్తోందివీరిలో దాదాపు 70 శాతం మంది మహిళా శ్రామికులున్నారుశతాబ్దాల నాటి నేత సంప్రదాయాలను పరిరక్షిస్తూనే.. ఉత్పాదకతసాంకేతిక పరిజ్ఞాన స్వీకరణట్రేసబిలిటీప్రామాణికతసుస్థిరతమార్కెట్ పోటీతత్వానికి సంబంధించిన సవాళ్లను ఈ రంగం ఎదుర్కొంటోందిపరిశోధనఆవిష్కరణసామర్థ్య నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా సవాళ్లను పరిష్కరించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

సంప్రదాయాన్ని సాంకేతికతతో జోడించాలన్న కేంద్రం దృక్పథాన్ని ప్రతిబింబించేలా ఐదు కీలక కార్యక్రమాల ఆవిష్కరణ ఈ ఆరంభ వేడుకలో జరగనుంది.

  • హ్యాండ్లూమ్ 4.0 - ప్రతి మగ్గానికి ఒక డిజిటల్ సహచరుడిగా నిలుస్తూ.. నేత కార్మికులకు ఉత్పాదకతసుస్థిరతను అంచనా వేయటానికి సహాయపడుతుందిఅలాగే సహకార సంఘాలు, ప్రభుత్వ సంస్థలకు సకాలంలో చివరి దశ వరకూ సహాయాన్ని అందించటంలో సహాయపడుతుంది.

  • హ్యాండ్లూమ్ ఇ-విద్యాచేనేత వ్యవస్థలోని నేత కార్మికులువిద్యార్థులుఇతర కీలక భాగస్వాములకు ఆచరణాత్మకఎంపిక చేసిన పరిష్కారాలను అందించే.. సమస్యలతో అనుసంధానించిన డిజిటల్ లెర్నింగ్, విజ్ఞాన కేంద్రం.

  • హ్యాండ్లూమ్ ఎక్స్ - చేనేత విలువ వ్యవస్థ వ్యాప్తంగా అంకుర సంస్థలుఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు యాక్సిలరేటర్, ఇంక్యుబేషన్ వేదిక.

  • కళాగృహ హ్యాండ్లూమ్ స్టూడియో (జెన్‌జెడ్ డిజైన్ స్టూడియో)డిజిటల్ విజువలైజేషన్కస్టమైజేషన్, ఉత్పత్తి ప్రామాణీకరణ ద్వారా చేనేతను తదుపరి తరం వినియోగదారులతో అనుసంధానించటమే దీని లక్ష్యం.

  • థ్రెడ్స్ ఆఫ్ వాలర్ - రీసైకిల్ చేసిన రక్షణ రంగానికి చెందిన వస్త్రాలను ప్రీమియం చేనేత ఉత్పత్తులుగా మారుస్తూ, వనరుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించే కార్యక్రమం.  

 

***


(रिलीज़ आईडी: 2291970) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Gujarati , Tamil , Kannada , Malayalam