హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైబర్ మోసాల నివారణ కేంద్రం

प्रविष्टि तिथि: 28 JUL 2026 3:16PM by PIB Hyderabad

భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం 'పోలీస్', 'శాంతిభద్రతలురాష్ట్ర పరిధిలో ఉండే అంశాలురాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు తమ చట్టబద్ధమైన సంస్థల (ఎల్ఈఏద్వారా సైబర్ మోసాలతో సహా నేరాల నివారణగుర్తింపుదర్యాప్తువిచారణకు ప్రాథమికంగా బాధ్యత వహిస్తాయిరాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల చట్ట అమలు సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి వివిధ పథకాల పరిధిలో సలహాలుఆర్థిక సాయం అందించడం ద్వారా వారి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది.

సైబర్ ఆర్థిక నేరాలతో సహా సైబర్ నేరాలను సమగ్రంగాసమన్వయ విధానంలో ఎదుర్కొనే యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి దిగువ పేర్కొన్న చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.

  1.  దేశంలో అన్ని రకాల సైబర్ నేరాలను పరిష్కరించే అనుబంధ కార్యాలయంగా ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (4సీ)ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందిఇది సమన్వయసమగ్ర విధానంలో పని చేస్తుంది.

  2. 4సీలో భాగంగా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ) (https://cybercrime.gov.inప్రారంభమైందిఇది మహిళలుచిన్నారులపై జరిగిన సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. అన్ని రకాల సైబర్ నేరాలకు సంబంధించిన ఘటనలపై ఫిర్యాదు నమోదు చేసే వీలును ప్రజలకు అందిస్తోంది.

  3.  ఆర్థిక మోసాలపై తక్షణమే ఫిర్యాదు చేయడానికినిధులను మోసగాళ్లు కొల్లగొట్టకుండా నిరోధించడానికి ఐ4సీ ఆధ్వర్యంలో ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎంఎస్)ను 2021లో ప్రారంభించారు4సీ ఆధ్వర్యంలో నడిచే సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎంఎస్ ప్రకారం 30.06.2026 నాటికి 32.80 లక్షల ఫిర్యాదుల్లో రూ.11,158 కోట్ల విలువైన సొమ్మును మోసగాళ్ల బారిన పడకుండా చూశారుఆన్‌లైన్‌లో సైబర్ ఫిర్యాదులను నమోదు చేయడంలో సాయం అందించడానికి ‘1930’ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

  4. సైబర్ నేరాలు ఎదుర్కోవడంలో తక్షణ చర్యలు చేపట్టడానికినిరంతర సహకారం కోసం ఐ4సీలో అత్యాధునిక సైబర్ మోసాల నివారణ కేంద్రం (సీఎఫ్ఎంసీ)ను ఏర్పాటు చేశారుఇక్కడ ప్రధాన బ్యాంకులుఆర్థిక మధ్యవర్తులుపేమెంట్ అగ్రిగేటర్లుటెలికాం సర్వీసు ప్రొవైడర్లుఐటీ మధ్యవర్తులురాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లా ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థల ప్రతినిధులు కలసి పనిచేస్తున్నారు.

  5. పోలీసు అధికారులు అందించిన నివేదిక ప్రకారం 30.06.2026 వరకు 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐలను భారత ప్రభుత్వం నిషేధించింది.

  6. బ్యాంకులు/ఆర్థిక సంస్థల సహకారంతో సైబర్ నేరగాళ్ల గుర్తింపు సమాచారానికి సంబంధించిన అనుమానితుల రిజిస్ట్రీని 10.09.2024న ఐ4సీ ప్రారంభించింది. 30.06.2026 వరకుబ్యాంకుల నుంచి స్వీకరించిన 30.48 లక్షలకు పైగా అనుమానితుల గుర్తింపు డేటాను, 32.08 లక్షల లేయర్-1 మ్యూల్ ఖాతా అనుమానితుల రిజిస్ట్రీలో భాగస్వామ్య సంస్థలతో పంచుకున్నారురూ.25,698 కోట్ల విలువైన లావాదేవీలను తిరస్కరించారు.

  7. సైబర్‌క్రైమ్ సమాచారాన్ని పంచుకోవడానికివిశ్లేషణల కోసం లా ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థ (ఎల్ఈఏ)లకు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్వేదికగాడేటా రిపోజిటరీగాసమన్వయ వేదికగా పనిచేయడానికి ‘సమన్వయ వేదిక’ను కార్యాచరణలోకి తీసుకువచ్చారుఇది వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని సైబర్ నేరాల ఫిర్యాదులతో సంబంధం ఉన్న నేరాలునేరస్తుల మధ్య విశ్లేషణ ఆధారిత అంతరాష్ట్ర సంబంధాల సమాచారాన్ని తెలియజేస్తుందినేరస్తుల స్థావరాలనునేర కేంద్రాలను మ్యాపులో గుర్తించి సంబంధిత అధికారులకు ‘ప్రతిబింబ’ మాడ్యూల్ స్పష్టమైన సమాచారాన్ని ఇస్తుంది4సీఇతర ఎస్ఎంఈల నుంచి సాంకేతిక–చట్టపరమైన సాయాన్ని అభ్యర్థించేస్వీకరించే వీలును లా ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థలకు అందిస్తుందిఫలితంగా 29,837కు పైగా నిందితులను అరెస్టు చేయడంతో పాటు 2,33,593కి పైగా సైబర్ దర్యాప్తు సహాయ అభ్యర్థనలు నమోదయ్యాయి.

  8. ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 79, ఉప సెక్షన్ (3), క్లాజ్ (బిప్రకారం.. సంబంధిత ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థ ద్వారా ఐటీ మధ్యవర్తులకు నోటీసులు పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి ‘సహయోగ్’ పోర్టలును ప్రారంభించారుతద్వారా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడేందుకు ఉపయోగిస్తున్న ఏదైనా సమాచారండేటా లేదా కమ్యూనికేషన్ లింకును అందుబాటులో లేకుండా చేయడం లేదా నిలిపివేయడానికి వీలవుతుంది.

  9. సైబర్ క్రైమ్ దర్యాప్తుఫోరెన్సిక్ప్రాసిక్యూషన్ వంటి కీలక అంశాలపై ఆన్‌లైన్ కోర్సుల ద్వారా పోలీసు అధికారులున్యాయాధికారుల సామర్థ్యాలను పెంపొందించడం కోసం ఐ4సీ కింద ‘సైట్రెయిన్’ అనే విస్తృతమైన సార్వత్రిక ఆన్‌లైన్ కోర్సుల (ఎంవోవోసీపోర్టలును అభివృద్ధి చేశారు. 2026 జూన్ 30 నాటికి వివిధ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,63,344 మందికి పైగా పోలీసు అధికారులు/న్యాయ అధికారులు ఇందులో నమోదు చేసుకున్నారుఈ పోర్టల్ 1,61,957కు పైగా ధ్రువపత్రాలను జారీ చేసింది.

  10. 2024 సెప్టెంబరు 10న ‘సైబర్ కమాండో’ కార్యక్రమాన్ని గౌరవ హోం శాఖ మంత్రి ప్రారంభించారుదేశంలో సైబర్ భద్రతకు చెందిన ముప్పును ఎదుర్కోవడం కోసం.. ప్రత్యేక శిక్షణ పొందిన సైబర్ కమాండోల ప్రత్యేక విభాగాన్ని దీని ద్వారా ఏర్పాటు చేశారుగౌరవనీయ హోంమంత్రి 10.09.2024 న ‘సైబర్ కమాండో’ కార్యక్రమాన్ని ప్రారంభించారుకీలక సమాచార మౌలిక సదుపాయాలను భద్రపరచగలజాతీయ సైబర్ భద్రత చర్యలకు తోడ్పాటునందించగల అంకితభావమూనైపుణ్యమూ కలిగిన కార్యబృందాన్ని నెలకొల్పడం ఈ కార్యక్రమ లక్ష్యంఈ క్రమంలో 281 మంది సైబర్ కమాండోలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు.

  11.   అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడంసామర్థ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా.. ‘స్టేట్ కనెక్ట్’, ‘ఠానా కనెక్ట్’, ‘బ్యాంక్ కనెక్ట్’మౌఖిక అభ్యాస సదస్సులను.. 4సీహోం మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.

  12. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు దర్యాప్తు అధికారులకు ప్రాథమిక దశలోనే సైబర్ ఫోరెన్సిక్ సహాయాన్ని అందించడం కోసం.. 4సీలో భాగంగా అత్యాధునిక జాతీయ డిజిటల్ విచారణ సహాయక కేంద్రాన్ని (గతంలో దీనిని జాతీయ సైబర్ ఫోరెన్సిక్ ప్రయోగశాల (విచారణ) {ఎన్‌సీఎఫ్ఎల్ (I)} అని పిలిచేవారు) 2019 ఫిబ్రవరి 18న ఢిల్లీలోనూ, 2025 ఆగస్టు 29న అస్సాంలోనూ ఏర్పాటు చేశారు. 2026 జూన్ 30 నాటికి సైబర్ నేరాలకు సంబంధించిన 14,064కు పైగా కేసుల్లో రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల అమలు సంస్థలకు ఢిల్లీలోని జాతీయ డిజిటల్ విచారణ సహాయక కేంద్రం సేవలను అందించింది.

  13. కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంసైబర్ నేరాల సంబంధిత ఫిర్యాదుల విచారణలో ఏకరూపతను తీసుకురావడం లక్ష్యంగా.. ఎన్సీఆర్పీ సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎంఎస్ కోసం సమగ్ర ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్‌వోపీమంత్రిత్వ శాఖ రూపొందించిందిఎన్‌సీఆర్పీ ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా.. ఫిర్యాదుల పరిశీలనబ్యాంకు సమన్వయంఫిర్యాదుల పరిష్కారంబ్యాంకు ఖాతాలో నిధుల నిలిపివేత (లీన్ మార్కింగ్‌)లను తొలగించడంమోసపూరితంగా కొల్లగొట్టిన నిధులను అర్హులకు తిరిగి అందించడం కోసం ఈ ఎస్‌వోపీ ఒక ప్రామాణిక విధానాన్ని నిర్దేశిస్తుందిమోసపోయిన బాధితులకు డబ్బును త్వరితగతిన తిరిగి ఇప్పించడం కోసం ‘మనీ రెస్టోరేషన్ మాడ్యూల్’బ్యాంకు ఖాతాల నిలుపుదలఆ మొత్తాలపై లీన్ మార్కింగ్ వంటి అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడానికి ఫిర్యాదుల పరిష్కార మాడ్యూల్ 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చాయి.

సైబర్ నేరాలపై అవగాహనను మరింత విస్తృతం చేసేలా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందిఇందులో భాగంగా కాలర్ ట్యూన్ ప్రచారంఎస్ఎంఎస్ ద్వారా సందేశాలను అందించడంతోపాటు.. 4సీ సోషల్ మీడియా ఖాతాలైన ఎక్స్ (గతంలో ట్విట్టర్) (@CyberDost), ఫేస్‌బుక్ (CyberDostI4C), ఇన్‌స్టా గ్రామ్ (CyberDostI4C), టెలిగ్రామ్ (cyberdosti4c) ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోందివీటితోపాటు.. ఎస్ఎంఎస్ ద్వారా ప్రచారంటీవీరేడియో ప్రసారాలుపాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలుసినిమా హాళ్లలో ప్రకటనలుప్రముఖులతో ప్రచారాలుఐపీఎల్ కాంపెయిన్మైగవ్ ద్వారా వివిధ మాధ్యమాల్లో ప్రచారంరాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో సైబర్ భద్రతభద్రతా అవగాహన వారోత్సవాల నిర్వహణమెట్రో స్టేషన్లురైల్వే స్టేషన్లువిమానాశ్రయాల్లో డిజిటల్ ప్రదర్శనల వంటి వివిధ చర్యలను ప్రభుత్వం చేపట్టింది.

లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఈ సమాచారాన్ని అందించారు. 

 

***


(रिलीज़ आईडी: 2290510) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil