పార్లమెంటరీ వ్యవహారాలు
జాతీయ ఈ-విధాన్ అమలు… 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో... 33 అంగీకారం
प्रविष्टि तिथि:
27 JUL 2026 3:49PM by PIB Hyderabad
37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విధాన సభలకు గాను 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విధాన సభలు జాతీయ ఈ-విధాన్ అప్లికేషన్ (ఎన్ఈవీఏ) అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో 21 విధాన సభలను ‘నేవా’ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ విధాన సభలుగా తీర్చిదిద్దారు. పార్లమెంటు ఉభయ సభల డిజిటలీకరణ మాత్రం ఎన్ఈవీఏ ప్రాజెక్టు పరిధికి వెలుపల ఉంది.
సభ కార్యకలాపాలను ఎలక్ట్రానిక్ ప్రాసెసింగుకు అనువైనవిగా మార్చడం ద్వారా సభ నిర్వహణ సామర్థ్యాన్ని ‘నేవా’ మెరుగుపరిచింది. ఇది కాగిత ఆధారిత ప్రక్రియలపైన ఆధారపడడాన్ని తగ్గించింది. దీంతో విధాన సభల కార్యకలాపాలను త్వరితగతిన ప్రాసెస్ చేయడం, ప్రసారం చేయడం సులభతరంగా మారింది. విధాన సభలు సమాచారాన్ని అందజేసే తీరు కూడా సరళతరమైంది. ఫలితంగా డాక్యుమెంట్ల ముద్రణ, నిర్వహణతో పాటు వాటిని భద్రపరిచి ఉంచడానికి పెట్టే ఖర్చు మిగిలింది.
‘నేవా’ ప్రాజెక్టు పనితీరును నీతి ఆయోగ్ పరిశీలించింది. నేవా- కాగితాల వాడకాన్ని తగ్గించిందనీ, విధానసభల కార్యకలాపాలను సుగమం చేసిందనీ పేర్కొన్నారు. చట్ట సభలు, ప్రభుత్వ విభాగాలకు మధ్య మెరుగైన సమన్వయంతో విధాన సభల పనితీరు వేగవంతమైంది. వాస్తవిక సమయంలో విధాన సభల డాక్యుమెంట్ల తక్షణ లభ్యతకు నేవా సార్వజనిక పోర్టల్ వీలు కల్పిస్తుంది. సేవాకేంద్రాలను ఏర్పాటు చేయడం సహా సామర్థ్యాన్ని పెంచే దిశగా నేవా చేపట్టిన కార్యక్రమాలు ఆసక్తిదారులకు సాంకేతిక సహాయాన్నీ, శిక్షణనీ అందించి ఈ ప్లాట్ఫారాన్ని అనుసరించడంలో సాయపడ్డాయని కూడా నివేదికలో తెలిపారు.
ఉపయోగించుకొనే వారి స్పందన, నిర్వహణ సంబంధిత అవసరాల ఆధారంగా నేవా అప్లికేషనుకు ఎప్పటికప్పుడు మరిన్ని మెరుగులు దిద్దుతుంటారు.
సైబర్ భద్రతను పెంచడానికి నేవా అప్లికేషనును సురక్షిత ఎన్ఐసీ మేఘ్రాజ్ 2.0 క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి మార్చారు. భాషిణితో కలపడంతో, సార్వజనిక పోర్టల్ కంటెంటును పాఠం వారీగా (టెక్స్ట్-టు-టెక్స్ట్) అనువదించడం సాధ్యం అయింది. దీంతో భాషాపరమైన సౌలభ్యమూ మెరుగుపడింది. అన్ని ఉపకరణాలపైనా నిర్వహించడానికి వీలు ఉండేటట్లు చూడటానికి ఈ అప్లికేషనును డివైస్-ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ మాదిరిగా రూపొందించారు. భూమిక ఆధారిత డాష్బోర్డులు, విధాన సభ డాక్యుమెంట్లకు వర్క్ఫ్లో ఆధారిత ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ వంటివి సభ్యులు, విధాన సభల సచివాలయాలతో పాటు ప్రభుత్వ విభాగాల వంటి వివిధ వినియోగదారుల మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తాయి.
ఈ సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ రాజ్యసభకు ఈ రోజు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2290208)
आगंतुक पटल : 4