ప్రధాన మంత్రి కార్యాలయం
మహాప్రభు జగన్నాథునిపై తన భక్తిని వివరిస్తూ.. రాష్ట్రపతి రాసిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
16 JUL 2026 2:25PM by PIB Hyderabad
మహాప్రభు జగన్నాథునిపై తనకున్న భక్తిని వివరిస్తూ.. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము రచించిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రజలతో పంచుకున్నారు. బాల్య స్మృతుల నుంచి తన జీవితాన్ని తీర్చిదిద్దిన ఆధ్యాత్మిక అనుభవాల వరకు, మహాప్రభు జగన్నాథునిపై ఉన్న భక్తి గురించి ఈ వ్యాసంలో రాష్ట్రపతి వివరించారు. రథయాత్ర వైభవం గురించి, ప్రజలకు సేవ చేయడంలో తనకు మార్గనిర్దేశం చేస్తున్న విశ్వాసం గురించి రాష్ట్రపతి వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి పోస్టు:
బాల్య స్మృతుల నుంచి తన జీవితాన్ని తీర్చిదిద్దిన ఆధ్యాత్మిక అనుభవాల వరకు మహాప్రభు జగన్నాథునిపై తనకున్న భక్తి గురించి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము వివరించారు.
రథయాత్ర వైభవం గురించి, ప్రజలకు సేవ చేయడంలో తనకు మార్గనిర్దేశం చేస్తున్న విశ్వాసం గురించి అందులో తెలియజేశారు.
hindustantimes.com/opinion/puri-rath-yatra-on-odisha-puris-grand-road-a-devotees-submission-101784133943590.html
***
(रिलीज़ आईडी: 2285337)
आगंतुक पटल : 15