ప్రధాన మంత్రి కార్యాలయం
భారత జౌళి రంగం శక్తినీ, విజన్- 2030 సంకల్పాన్నీ.. ‘భారత్ టెక్స్- 2026’ ప్రతిబింబిస్తున్న తీరుపై కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
15 JUL 2026 2:34PM by PIB Hyderabad
భారత జౌళి రంగంలోని అన్ని దశలనూ భారత్ టెక్స్- 2026 ఒకే ఛత్రం కిందకు తెచ్చిన తీరును వివరిస్తూ కేంద్ర సహాయ మంత్రి శ్రీ పబిత్రా మార్గరీటా రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. దేశ తయారీ సామర్థ్యమూ, సుసంపన్నమైన వస్త్ర పరిశ్రమ వారసత్వమూ, అంతర్జాతీయ విస్తృతినీ వివరిస్తూ ఈ వ్యాసం సాగింది. జౌళి రంగానికి సంబంధించి భారత ‘విజన్ - 2030’ ప్రణాళికను కూడా ఈ వ్యాసం వివరిస్తోందని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
భారత్_టెక్స్ 2026 కార్యక్రమం దేశ జౌళీ రంగంలోని అన్ని దశలనూ ఒకే ఛత్రం కిందకు తెచ్చిందని కేంద్ర సహాయ మంత్రి శ్రీ శ్రీ పబిత్రా మార్గరీటా పేర్కొన్నారు. దేశ తయారీ సామర్థ్యానికీ, సుసంపన్నమైన వస్త్ర పారిశ్రామిక వారసత్వానికీ, పెరుగుతున్న అంతర్జాతీయ విస్తృతికీ ఇది నిదర్శనం. జౌళీ రంగానికి సంబంధించి భారత విజన్- 2030 ప్రణాళికను కూడా ఈ వ్యాసం వివరిస్తోంది.
(रिलीज़ आईडी: 2284795)
आगंतुक पटल : 10