ప్రధాన మంత్రి కార్యాలయం
నిస్వార్థ త్యాగ వారసత్వం చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
06 JUL 2026 12:41PM by PIB Hyderabad
ఇతరుల సంక్షేమాన్ని కోరి త్యాగం చేసే వారు అమరత్వాన్ని పొందుతారని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి యేషాం యశఃకాయే జరామరణజం భయమ్’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రధాని ప్రస్తావించారు.
భారత్ ఏకత, సమగ్రత, ఆత్మగౌరవం కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం ప్రతి తరానికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుందని కూడా శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
భారత వర్షం ఏకత, అఖండత, స్వాభిమాన పరిరక్షణ కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం ప్రతి తరానికీ స్ఫూర్తిదాయకం.
‘‘జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి యేషాం యశఃకాయో జరామరణజం భయమ్’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2281578)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam