ప్రధాన మంత్రి కార్యాలయం
రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్కు ప్రధానమంత్రి నివాళులు
प्रविष्टि तिथि:
26 JUN 2026 12:46PM by PIB Hyderabad
రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు నివాళులర్పించారు. సాహూ మహారాజ్ తన జీవితాన్ని అణగారిన, శ్రమ దోపిడీకి గురైన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆదర్శాలు రాబోయే తరాలకు, దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘రాజర్షి ఛత్రపతి సాహూ జీ మహారాజ్ జయంతి సందర్భంగా వారికి నా గౌరవపూర్వక నివాళులు. ఆయన సామాజిక న్యాయానికి, సమానత్వానికి బలమైన మద్దతుదారు. సమాజంలోని నిరుపేదలు, దోపిడీకి గురైనవారు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆదర్శాలు చిరకాలం ఈ దేశానికి స్ఫూర్తినిస్తూ, మార్గదర్శకంగా నిలుస్తాయి’’.
(रिलीज़ आईडी: 2278192)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam