రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లో రూ. 493 కోట్లతో ఆదిపూర్-భుజ్ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం


కచ్ ప్రాంతంలో రైల్వే సామర్థ్యం పెంపు, అనుసంధానం మరింత బలోపేతం

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ రెండు వైపులా అదనంగా రెండు ప్యాసింజర్ రైళ్ల నిర్వహణకు అవకాశం

డబుల్ లైన్ ద్వారా అదనంగా 12 ఎంటీపీఏ సరుకు రవాణాకు మార్గం సుగుమం

రవాణా రంగం, పారిశ్రామిక అనుసంధానానికి భారీ ఊతం..

प्रविष्टि तिथि: 17 JUN 2026 2:30PM by PIB Hyderabad

గుజరాత్‌లో రైల్వే మౌలిక సదుపాయాల వృద్ధికిరవాణా సామర్థ్య పెంపునకు భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుందిపశ్చిమ రైల్వే పరిధిలోని 49 కిలోమీటర్ల పొడవైన ఆదిపూర్-భుజ్ రైల్వే సెక్షన్‌ను రూ. 493 కోట్ల వ్యయంతో డబ్లింగ్ (రెండు లైన్లుగా మార్చడంచేయడానికి  రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.

రైల్వే లైన్ల డబ్లింగ్ట్రిప్లింగ్నెట్‌వర్క్ విస్తరణ ద్వారా రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే నిరంతరం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందివ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగిన ఈ రైల్వే లైన్ డబ్లింగ్ పూర్తి కావడం ద్వారా కచ్ ప్రాంతంలో రైలు రవాణా మరింత బలోపేతం కానుందిభవిష్యత్తులో ఈ మార్గంలో పెరగనున్న ప్రయాణికులసరుకు రవాణా రద్దీకి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

వేగంగా పెరుగుతున్న ట్రాఫిక్ కారిడార్‌లో సామర్థ్య పెంపు

గాంధీధామ్నలియా కారిడార్‌లో ప్రస్తుతం ఒకే ఒక ట్రాక్ మార్గంగా ఉన్న ఈ ఆదిపూర్-భుజ్ సెక్షన్‌లో ఇప్పటికే పలు రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయివీటిలో భుజ్-నలియా గేజ్ మార్పిడి పనులునలియా-వాయోర్ లైన్ పొడిగింపునలియా-జఖౌవాయోర్-లఖ్‌పత్దేశాల్‌పర్లూనా ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న కొత్త రైల్వే లైన్లు ఉన్నాయివీటి కారణంగా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో రైళ్ల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉంది

ఈ రైల్వే ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి కానుండటంతో ఆ మార్గం ద్వారా అదనపు ప్యాసింజర్సరుకు రవాణా రైళ్ల రాకపోకలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారుదీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీకి తగిన సామర్థ్యాన్ని కల్పించడానికిరైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికిభవిష్యత్తు రవాణా డిమాండును తట్టుకోవడానికి వీలుగా ఈ డబ్లింగ్ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతతో ఆమోదం లభించింది.

మెరుగైన ప్యాసింజర్గూడ్స్ రైళ్ల నిర్వహణ:

ఈ డబ్లింగ్ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల ప్రయాణికులకుసరుకు రవాణా రంగానికి ఎంతో మేలు జరగనుందిఈ మార్గంలో ప్రతిరోజూ రెండు వైపులా కలిపి అదనంగా ప్రయాణికుల రైళ్లను నడపడానికి వీలవుతుందిఇది ఈ ప్రాంతంలోని ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్నిరవాణాను మరింత మెరుగుపరుస్తుంది.

ఈ డబుల్ లైన్ ద్వారా ప్రతి సంవత్సరం అదనంగా 12 మిలియన్ టన్నులకు రవాణా సాధ్యమవుతుందిఇది పశ్చిమ గుజరాత్‌లో రవాణా రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండాపారిశ్రామిక అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

భవిష్యత్తు వృద్ధినిర్వహణకు ఊతం

ఈ రైల్వే సెక్షన్ లైన్ సామర్థ్య వినియోగం రాబోయే 2029-30 నాటికి ఏకంగా 123 శాతానికి పెరిగే అవకాశం అంచనా వేస్తున్నారుఇది సకాలంలో సామర్థ్యాన్ని పెంచడం ఎంత అవసరమో తెలియజేస్తుందిప్రస్తుతం చేపట్టబోయే డబ్లింగ్ పనులు ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గిస్తాయిఅలాగే రైళ్ల నిర్వహణలో ఉన్న అడ్డంకులను తొలగించిరైళ్లు మరింత ఖచ్చితత్వంతోనమ్మకంగా నడవడానికి దోహదపడతాయిప్రయాణికులుసరుకు రవాణా పెరగడం ద్వారా భారతీయ రైల్వేకు అదనపు ఆదాయం సమకూరడమే కాకుండాకచ్ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుంది.

ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం ద్వారా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతులను సృష్టించడంరైలు  ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడందేశంలో రోజురోజుకీ  పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడం కోసం భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోందని మరోసారి నిరూపితమైంది.

***


(रिलीज़ आईडी: 2274084) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada