ప్రధాన మంత్రి కార్యాలయం
రైతుల సంక్షేమం, సాధికారత కల్పనపై వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 JUN 2026 8:06PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
గత 12 సంవత్సరాల్లో రైతుల సంక్షేమానికీ, వారికి సాధికారతను కల్పించడానికి చేపట్టిన అపూర్వ కృషిని ఆ వ్యాసం ముఖ్యంగా ప్రస్తావించింది. అన్నదాతలను దృష్టిలో పెట్టుకొని అమలుచేసిన వివిధ కార్యక్రమాలు వారి జీవితాల్లో చెప్పుకోదగ్గ సానుకూల మార్పులను తీసుకువచ్చాయని ఆ వ్యాసం పేర్కొనడంతో పాటు వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్న తీరును కూడా వివరించింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘రైతు సోదరీ, సోదరుల సంక్షేమంతో పాటు వారికి సాధికారతను కల్పించే దిశగా ఇదివరకెన్నడూ ఎరుగని కార్యక్రమాలను గత 12 సంవత్సరాల్లో అమలుచేశారు. అన్నదాతల కోసం మేం తీసుకువచ్చిన పథకాలతో వారి జీవితాల్లో అనేక సకారాత్మక మార్పులు వచ్చాయి. వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న ఈ పెనుమార్పులను గురించి కేంద్ర మంత్రి శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ గారు తాను రాసిన ఒక వ్యాసంలో సమగ్రంగా వివరించారు’’ అని తెలిపింది.
***
(रिलीज़ आईडी: 2272880)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam