ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో అక్రమంగా రవాణా చేసిన రూ.14 కోట్ల విలువైన
71 లక్షల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ.. నలుగురు అరెస్టు
प्रविष्टि तिथि:
12 JUN 2026 4:04PM by PIB Hyderabad
విదేశీ సిగరెట్ల అక్రమ రవాణాపై నిఘాలో భాగంగా ఈశాన్య ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఏకకాలంలో పలు దాడులను నిర్వహించింది.
ఈశాన్య ప్రాంతంలో మే 2026 నుంచి నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.14 కోట్ల విలువైన సుమారు 71 లక్షల విదేశీ సిగరెట్లను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది.

జూన్ 11, 2026న నిర్వహించిన కీలక ఆపరేషన్ లో భాగంగా మిజోరాంలో మాండ్, ఎక్స్ఎస్ఓ, ఓరిస్, పాట్రన్ వంటి బ్రాండ్లకు చెందిన 45 లక్షలకు పైగా విదేశీ సిగరెట్లను డీఆర్ఐ సీజ్ చేసింది. 34వ బెటాలియన్ అస్సాం రైఫిల్స్ సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సిగరెట్లను భారత్-మయన్మార్ సరిహద్దులోని జోఖౌథర్ సెక్టార్ ద్వారా దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
గత కొన్ని వారాలుగా జరిగిన వరుస ఆపరేషన్లలో మరో 26 లక్షల సిగరెట్లను స్వాధీనం చేసుకోగా, ముగ్గురు అరెస్టయ్యారు.
***
(रिलीज़ आईडी: 2272224)
आगंतुक पटल : 7