ప్రధాన మంత్రి కార్యాలయం
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆత్మీయ శుభాకాంక్షలు... కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 JUN 2026 9:11PM by PIB Hyderabad
తనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజాస్వామ్యంలో ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం ప్రజల అపారమైన ఆశీస్సులు, అభిమానాల ఫలితమేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ, సంపన్న భారత్ను నిర్మించాలనే సంకల్పాన్ని మనమంతా మరింత దృఢ నిశ్చయంతో కలిసికట్టుగా ముందుకు తీసుకువెళదామని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"గౌరవనీయ ఓం బిర్లా గారూ, మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలు. భారత ప్రజాస్వామ్యంలో ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం దేశ ప్రజల అపారమైన ఆశీస్సులు, అభిమానాల ఫలితమే. అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ, సుసంపన్న భారత్ను నిర్మించాలనే సంకల్పాన్ని మనం కలిసికట్టుగా మరింత దృఢ నిశ్చయంతో ముందుకు తీసుకువెళ్దాం’’.
***
(रिलीज़ आईडी: 2271493)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam