ప్రధాన మంత్రి కార్యాలయం
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని బాధితులకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రకటన
प्रविष्टि तिथि:
08 JUN 2026 7:32PM by PIB Hyderabad
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల చొప్పున అందజేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. గాయపడిన ప్రతి ఒక్కరికీ రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను. బాధితులకు స్థానిక అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారు.
మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సహాయం అందిస్తాం: ప్రధాని”
***
(रिलीज़ आईडी: 2270596)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam