పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించిన కేంద్ర పర్యావరణ మంత్రి


ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా

కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో భారీ హరిత కార్యక్రమాలు ప్రారంభం

పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ప్రపంచ అగ్రగామిగా భారత్ అవతరించిందన్న శ్రీ భూపేందర్ యాదవ్... ప్రజా భాగస్వామ్యంతో కూడిన పర్యావరణ పరిరక్షణకు పిలుపు

ఈ ఏడాది ఢిల్లీలో 15 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం... పచ్చదనాన్ని పెంపొందించడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్న ముఖ్యమంత్రి

శాస్త్రీయ పర్యావరణహిత పాలన బలోపేతానికి ఎన్‌సీటీ ఢిల్లీ కార్యాచరణ ప్రణాళిక, అసోలా భట్టి అభయారణ్యం నిర్వహణ ప్రణాళిక, ఢిల్లీ బర్డ్ అట్లాస్‌ విడుదల

प्रविष्टि तिथि: 05 JUN 2026 12:04PM by PIB Hyderabad

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఢిల్లీ వ్యాప్తంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తాతో కలిసి కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా మైదాన్‌గఢిలోని నమో ఆక్సిజన్ పార్కులో నిర్వహించిన ఈ వేడుకలో పలు పర్యావరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారుజాతీయ రాజధాని ప్రాంతంలో పచ్చదనాన్ని బలోపేతం చేయడంగాలి నాణ్యతను మెరుగుపరచడంప్రజా భాగస్వామ్యంతో కూడిన పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచింది

 

ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ఢిల్లీ పర్యావరణఅటవీవన్యప్రాణుల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సాకేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖఢిల్లీ ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులుఇతర ప్రముఖులు పాల్గొన్నారు

సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మానవాళి వాతావరణ మార్పులుజీవవైవిధ్య క్షీణతఎడారీకరణకు దారితీసే భూసార క్షీణత వంటి మూడు ప్రధాన పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ప్రపంచ అగ్రగామిగా భారత్ అవతరించిందని ఆయన పేర్కొన్నారుసౌరశక్తి సామర్థ్యాన్ని పెంపొందించడంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలవడంపీఎం సూర్య ఘర్ యోజన అమలుఅంతర్జాతీయ సౌర కూటమి స్థాపనఅంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ)  ఏర్పాటురామ్‌సర్ చిత్తడి నేలల విస్తరణఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు పరిధిలో నిర్దేశించుకున్న పలు జాతీయ నిర్ధారిత సహకార (ఎన్‌డీసీలక్ష్యాలను గడువుకంటే ముందే సాధించడం వంటి కీలక విజయాలను భారత్ అధిగమించిందని ఆయన పేర్కొన్నారు

పర్యావరణ పరిరక్షణకు సమష్టి కృషిక్రియాశీల ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.  ప్రధానమంత్రి ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని ప్రస్తావిస్తూ.. ఈ కార్యక్రమం మొక్కలు నాటడాన్ని కేవలం ఒక విధిగా కాకుండా కృతజ్ఞతబాధ్యతపర్యావరణ స్పృహతో కూడిన ప్రజా ఉద్యమంగా మార్చిందని ఆయన కొనియాడారుపౌరులు కేవలం మొక్కలు నాటడమే కాకుండారాబోయే తరాల కోసం వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు

 

ఢిల్లీ పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను శ్రీ భూపేందర్ యాదవ్ వివరించారుగాలి నాణ్యత నిర్వహణ కమిషన్ సమన్వయంతో ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపై దుమ్మువాహనాల ఉద్గారాలుపారిశ్రామిక కాలుష్యంతో కూడిన వాయు కాలుష్య కారకాలను నియంత్రించడానికి కీలక చర్యలు తీసుకుంటోందని తెలిపారుఈ చర్యల్లో భాగంగా నిరంతర ఉద్గార పర్యవేక్షణ వ్యవస్థల ఏర్పాటువాయు కాలుష్య నియంత్రణ పరికరాల వినియోగంరోడ్లను యంత్రాల ద్వారా శుభ్రం చేయడంఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారడం వంటి చర్యలను చేపట్టినట్లు వివరించారు

నమో వ్యాన్లుఇతర పర్యావరణ వనరుల అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించే హరిత కార్యక్రమాలను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారుఈ దిశగా ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికిజీవవైవిధ్యాన్ని పెంపొందించడానికిపౌరులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు18 నమో ఆక్సిజన్ పార్కులను అభివృద్ధి చేసి ప్రారంభించినట్లు ఆయన తెలిపారుఈ కార్యక్రమాల దీర్ఘకాలిక విజయానికి ప్రజా భాగస్వామ్యం అత్యంత కీలకమని చెప్పారుసంపూర్ణ పర్యావరణ వ్యవస్థ రక్షణపర్యావరణ స్థితిస్థాపకతను నిర్ధారించడానికి అడవులుచిత్తడి నేలలుగడ్డి భూములను సమగ్రంగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు

ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్‌సీటీ ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన మూడు ముఖ్యమైన పర్యావరణ ప్రచురణలను విడుదల చేశారు.

1.   ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం కోసం కార్యాచరణ ప్రణాళిక పత్రం (2026-27 నుంచి 2036-37): ఢిల్లీలో పర్యావరణ పరిపాలనపరిరక్షణసుస్థిర అభివృద్ధికి సంబంధించిన వ్యూహాలులక్ష్యాలను వివరించే పదేళ్ల కార్యాచరణ ప్రణాళిక

2. అసోలా భట్టి వన్యప్రాణుల అభయారణ్యాల నిర్వహణ ప్రణాళిక (2024-25 నుంచి 2034-35): ఢిల్లీలోని అత్యంత కీలకమైన జీవవైవిధ్య నిధుల సంరక్షణ కోసం రూపొందించిన సమగ్ర నిర్వహణ ప్రణాళికఇది రాబోయే దశాబ్ద కాలంలో అభయారణ్య రక్షణపునరుద్ధరణసుస్థిర నిర్వహణకు దిశానిర్దేశం చేస్తుంది

3. ఢిల్లీ బర్డ్ అట్లాస్ఢిల్లీ నగరవ్యాప్తంగా ఉన్న పక్షిప్రకృతి ప్రేమికులుస్వచ్ఛంద సేవకుల ఉమ్మడి భాగస్వామ్యంతో ఢిల్లీలోని పక్షి జాతులపై సేకరించిన సమాచారంతో రూపొందించిన పుస్తకం

వేగంగా విస్తరిస్తున్న పట్టణ జనాభా మధ్య.. పట్టణ పర్యావరణ వ్యవస్థల సమర్థవంతమైన నిర్వహణజీవవైవిధ్య పరిరక్షణచిత్తడి నేలల రక్షణసుస్థిర అభివృద్ధికి ఈ శాస్త్రీయ ప్రణాళికా పత్రాలు ఎంతగానో దోహదపడతాయని శ్రీ భూపేందర్ యాదవ్ తెలిపారు.  అలాగే రాజధానిలో పర్యావరణహిత పరిపాలనను బలోపేతం చేయడంలోనూ సహాయపడతాయని పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి పచ్చదనాన్ని పెంపొందించడం అత్యంత కీలకమైన చర్యగా అభివర్ణించారు.  ప్రస్తుత సంవత్సరంలో ఢిల్లీ వ్యాప్తంగా 15 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆమె ప్రకటించారుపర్యావరణ పరిరక్షణలో పౌరుల పాత్రను ప్రస్తావిస్తూ.. కేవలం మొక్కలు నాటే కార్యక్రమాలకే కాకుండానాటిన తర్వాత ఆ మొక్కలను పోషించడానికిసంరక్షించడానికిసమాజ భాగస్వామ్యం ఎంతో అవసరమని స్పష్టం చేశారు

ఈ సందర్భంగా ప్రముఖులందరూ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో భాగంగా మొక్కలు నాటడంతోపాటు ‘కాలుష్య రహిత ఢిల్లీ’ ప్రచారంలో భాగంగా స్థానిక రకాల గడ్డిపొదలకు సంబంధించిన ప్రదర్శనను తిలకించారుతద్వారా పర్యావరణ పరిరక్షణసుస్థిర అభివృద్ధి పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారు.‘ఢిల్లీ బర్డ్ అట్లాస్’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన స్వచ్ఛంద సంస్థలను ఈ వేడుకలో ప్రశంసా పత్రాలతో సత్కరించారుపర్యావరణానికి సంబంధించిన సమాచార సేకరణపర్యవేక్షణలో ప్రజల భాగస్వామ్యం అమూల్యమైనదని కొనియాడారు.

***


(रिलीज़ आईडी: 2269337) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Kannada