సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రక్షణపై కేంద్ర మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝీ సమీక్ష
ప్రపంచ పరిణామాల వల్ల తలెత్తే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించి, సకాలంలో తగిన వ్యూహాలను రూపొందించాలని కేంద్రమంత్రి ఆదేశాలు
प्रविष्टि तिथि:
03 JUN 2026 8:09PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా దేశ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంపై పడే ప్రభావాలను అంచనా వేసేందుకు కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝీ, సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే, మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో కలిసి జూన్ 2న న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో ఈ సమావేశంలో పలు కీలక సవాళ్లపై లోతుగా చర్చించారు. ముడిసరుకుల లభ్యత, ధరలు, ఎగుమతులు, దిగుమతులు, సరుకు రవాణా, గ్యాస్ సమస్యలు, నిర్వహణ మూలధనం వంటి సమస్యలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ అంతర్జాతీయ పరిణామాల వల్ల భవిష్యత్తులో తలెత్తే ఎలాంటి సవాళ్లనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ప్రస్తుత పరిస్థితులను నిరంతరం నిశితంగా గమనిస్తూ ఉండాలని, సమయస్ఫూర్తితో కూడిన తగిన వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగానిది అత్యంత కీలకమైన పాత్ర అని, దీనిని ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా అభివర్ణించారు. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా, దేశ ఉత్పాదక రంగం, ఎగుమతుల్లో అత్యధిక వాటాను కలిగి ఉందన్నారు. ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను కాపాడటానికి, ఈ రంగం నిరంతరం వృద్ధిని, పటిష్టతను నిర్ధారించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రుణ హామీ పథకం (సీజీఎస్ఎంఎస్ఈ), డిజిటల్ సాధికారత, ఆర్థిక సమ్మిళిత్వం వంటి వినూత్న కార్యక్రమాలు ఎంఎస్ఎంఈ రంగం పటిష్టతను, ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేశామని శ్రీ మాంఝీ పేర్కొన్నారు.

***
(रिलीज़ आईडी: 2268910)
आगंतुक पटल : 9